మార్కెట్లకు ఐటీ, బ్యాంకింగ్ అండ, దుమ్మురేపిన HDFC
స్టాక్ మార్కెట్లు సోమవారం (జూలై 20) లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్ల అండతో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ 11 వేల మార్క్ అందుకుంది. సెన్సెక్స్ 399 పాయింట్లు ఎగిసి 37,419 పాయింట్లకు, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 11,022 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం వ్యాల్యూ 74.92గా ఉంది.
3 కంపెనీలు రూ.1 లక్ష కోట్లు ప్లస్, 7 కంపెనీలు రూ.37వేల కోట్లు లాస్
ఫార్మా రంగం మినహా.. లాభాలు
టాప్ గెయినర్స్ జాబితాలో బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, యూపీఎల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో సన్ ఫార్మా, సిప్లా, జీ ఎంటర్టైన్మెంట్, బీపీసీఎల్, ఎన్టీపీసీ ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఫార్మా రంగం మినహా అన్ని షేర్లు లాభాల్లోనే క్లోజ్ అయ్యాయి. ఇటీవల క్వార్టర్ 1 ఫలితాల్లో రాణించిన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నేటి ట్రేడింగ్లో దూసుకెళ్లాయి. 3 శాతం మేర షేర్ వ్యాల్యూ పెరిగింది.
ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ)లు రూ.697 కోట్ల విలువైన స్యాక్స్ కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్ (డీఐఐ) రూ.209 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ.1,091 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, డీఐఐలు రూ.1,660 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఐటీ రంగం 2.6 శాతం అప్
ఎన్ఎస్ఈలో ఫార్మా (1.6 శాతం) నష్టపోయింది. మిగిలిన అన్ని రంగాలు బలపడ్డాయి. ఐటీ రంగం 2.6% పుంజుకోగా, బ్యాంకు నిఫ్టీ 1.6% ఎగిసింది. నిఫ్టీ దిగ్గజాలలో బ్రిటానియా, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, బజాజ్ ఫిన్, హీరో మోటో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మూడు శాతం నుండి ఐదు శాతం జంప్ చేశాయి. సన్ ఫార్మా, సిప్లా, జీ, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఐటీసీ, మారుతీ, ఎల్ అండ్ టీ, హిండాల్కో 4% నుండి 0.8% మధ్య బలహీనపడ్డాయి.