అదరగొట్టిన మార్కెట్లు, భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమై, భారీ లాభాల్లో ముగిశాయి. వ్యాక్సినేషన్ పురోగతి, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్, ఆర్థిక, లోహా రంగ షేర్లు రాణించాయి. స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు లాభాల్లో ముగియగా, ఐటీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, గ్రాసీమ్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, టాటా స్టీల్, HDFC, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.
సెన్సెక్స్ నేడు 52,694.89 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,806.86 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,545.68 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,794.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,820.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,744.60 పాయిట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 397.04 (0.76%) పాయింట్లు ఎగిసి 52,769.73 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 119.75 (0.76%) పాయింట్ల వద్ద ముగిసి 15,812.35 పాయింట్ల వద్ద ముగిసింది.