Market Crash: కుప్పకూలిన Sensex Nifty.. వారాంతంలో ఇన్వెస్టర్స్ గేమ్..
Market Crash: వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఉదయం నుంచి నెటగివ్ నోట్ లోనే సూచీలు కొనసాగాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 505 పాయింట్లు కోల్పోయింది. మరో కీలక సూచీ నిఫ్టీ 166 పాయింట్లు క్షీణించగా.. నిఫ్టీ బ్యాంక్ సూచీ 415 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 296 పాయింట్ల మేర నష్టపోయాయి. ప్రధానంగా ఆటో, ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ స్టాక్స్ లాభపడ్డాయి. అంతర్జాతీయ ప్రతికూలతలతో పాటు.. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గు చూపటం మార్కెట్ల పతనానికి కారణంగా ఉంది.

కర్ణాటక ప్రభుత్వం మద్యం ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సిద్ధరామయ్య ప్రభుత్వం సుంకం పెంచింది. దేశంలో తయారు చేసిన విదేశీ లిక్కర్ పై 20 శాతం, బీర్లపై 10 శాతం సుంకాన్ని ఇప్పుడున్నదాని కంటే పెంచాలని నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా లిక్కర్ స్టాక్స్ మార్కెట్లో కుప్పకూలాయి. దీంతో United Spirits, Globus Spirits, Radico Khaitan, Som Distilleries షేర్లు నష్టపోయాయి.
NSEలో టాటా మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, సిప్లా కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిమ్, ఎల్ టి, టాటా కన్జూమర్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications