ముంబై: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. HCL టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టెక్ మహీంద్రా తదితర షేర్లు భారీగా రాణించడంతో సెన్సెక్స్ సరికొత్త గరిష్టాలను తాకింది. నిఫ్టీ కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. రూపాయి బలపడటం, FIIల కొనుగోళ్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగమందుకోవడం, కరోనా ఆంక్షల సడలింపు, బలమైన ఆర్థిక వ్యవస్థ గణాంకాలు, కీలక రంగాల రాణింపు వంటి అంశాలు సూచీల పరుగుకు అండగా నిలబడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.12 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 58,411.62 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,515.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,200.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,399.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,429.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,345.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 166.96 (0.29%) పాయింట్లు లాభపడి 58,296.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 54.20 (0.31%) పాయింట్లు ఎగిసి 17,377.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 13 స్టాక్స్ లాభపడ్డాయి. HCL టెక్ 2.67 శాతం, ఇన్ఫోసిస్ 1.78 శాతం, రిలయన్స్ 1.62 శాతం, టెక్ మహీంద్రా 0.93 శాతం, బజాజ్ ఆటో 0.74 శాతం లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.13 శాతం, కొటాక్ మహీంద్రా బ్యాంక్ 0.86 శాతం, ఐటీసీ 0.66 శాతం, HDFC బ్యాంక్ 0.64 శాతం నష్టపోయాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో 4.79 శాతం, HCL టెక్ 2.16 శాతం, ఇన్ఫోసిస్ 1.75 శాతం, హిండాల్కో 1.72 శాతం, రిలయన్స్ 1.55 శాతం లాభపడ్డాయి. ఐవోసీ 1.33 శాతం, ఓఎన్జీసీ 1.18 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.18 శాతం, బ్రిటానియా 1.09 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 0.97 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

మార్కెట్ తన సానుకూల ధోరణిని కొనసాగించిందని, ఇతర ప్రపంచ మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయని, నిఫ్టీ ఇప్పటికీ అధిగ దిగువ నిర్మాణాన్ని కొనసాగిస్తోందని, ఇది విస్తృతంగా సానుకూలంగా ఉందని, ఏదేమైనా మార్కెట్ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో 17330 మద్దతు స్థాయిగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇండెక్స్ 17330 వద్ద ట్రేడ్ అవుతున్నంత వరకు అప్ ట్రెండ్ 17450-17500 స్థాయిలో ఉండవచ్చునని, 17,330 పాయింట్ల దిగువకు పడిపోతే మాత్రం 17250-17210 స్థాయికి పడిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఇండెక్స్ ఇటీవల మంచి లాభాలతో ప్రారంభమవుతోందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూల సంకేతాలు, ఐటీ, రియాల్టీ స్టాక్స్ నుండి బలమైన మద్దతు డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా ఉందని చెబుతున్నారు. అమెరికాలో బలమైన జాబ్ డేటా, జపాన్, చైనాలలో మరింత ఉద్దీపన, ఫెడ్ రిజర్వ్ ద్వారా ఆర్థిక మద్దతు కొనసాగుతుందనే ఆశలు ప్రపంచ మార్కెట్లను పెంచాయి. నేడు నిఫ్టీ ఐటీ, మీడియా సూచీలు 1.3 శాతం కంటే పైన లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు మాత్రం నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ రియాల్టీ స్టాక్స్ మాత్రం ఎప్పటికప్పుడు రికార్డ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇటీవల ఏకంగా 16 శాతం లాభపడింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications