Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మెరిసిన ఐటీ స్టాక్స్..
Market Closing: ఈరోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ జోరును రోజంతా కొనసాగించాయి. ప్రధానంగా ఆదాయాల ప్రకటనలు మార్కెట్లను ముందుకు నడుపుతున్నాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 401 పాయింట్ల మేర లాభపడగా.. మరో సూచీ నిఫ్టీ 119 పాయింట్ల పెరిగింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 517 పాయింట్లు పెరగగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 122 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని ముగించింది. ప్రధానంగా ఐటీ, ఫైనాన్స్ రంగాల షేర్లు లాభపడగా.. ఫార్మా స్టాక్స్ మాత్రం నష్టాల బాట పట్టాయి.

NSE సూచీలో హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఎస్బీఐ, గ్రాసిమ్, హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ, అపోలో హాస్పిటల్స్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టి, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే క్రమంలో డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, మారుతీ, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, యూపీఎల్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ గా ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications