ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం(జూలై 7) లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపు ఊగిసలాటలో కనిపించాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చి, చివరి అరగంటలో జంప్ చేశాయి. చివరకు సెన్సెక్స్ 193 పాయింట్ల లాభాల్లో, నిఫ్టీ 61 పాయింట్ల లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఓ దశలో సెన్సెక్స్ 52,101 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం ఒకటి తర్వాత మెటల్, రియాల్టీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగ షేర్లు పుంజుకున్నాయి. దీంతో సూచీలు గరిష్ఠాలను తాకాయి. నిఫ్టీ ఇదే ట్రెండ్ను కొనసాగించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్ 193 పాయింట్లు లాభపడి 53,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు ఎగిసి 15,879 వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.60 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 52,919.71 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,105.41 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,751.76 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,819.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,893.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,779.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, హిండాల్కో, యూపీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, ఓఎన్జీసీ, మారుతీ సుజుకీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి. సెన్సెక్స్ 53వేల పాయింట్ల క్లోజ్ కావడం ఇదే మొదటిసారి. నిఫ్టీ 15,900 పాయింట్లకు చేరువైంది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications