For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో మార్కెట్లు: సెన్సెక్స్ 530 పాయింట్లు జంప్, పుంజుకున్న రిలయన్స్ స్టాక్

|

ముంబై: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 306.19 పాయింట్లు(0.77%) లాభపడి 40,063.77 వద్ద, నిఫ్టీ 91.50 పాయింట్లు(0.78%) లాభపడి 11,760.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 677 షేర్లు లాభాల్లో, 192 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 39 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రంగాలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 0.7 శాతం మేర లాభపడ్డాయి. ఇక, డాలర్ మారకంతో రూపాయి 10 పైసలు లాభపడి ప్రారంభమైంది. నిన్న 74.43 వద్ద క్లోజ్ అయింది.

మార్కెట్‌ను కాపాడిన బ్యాంకులు, రిలయన్స్ భారీ దెబ్బ.. రూ.లక్షల కోట్లు హాంఫట్మార్కెట్‌ను కాపాడిన బ్యాంకులు, రిలయన్స్ భారీ దెబ్బ.. రూ.లక్షల కోట్లు హాంఫట్

40,000 మార్క్ దాటిన సెన్సెక్స్

40,000 మార్క్ దాటిన సెన్సెక్స్

మధ్యాహ్నం గం.11.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, హిండాల్కో, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

సెన్సెక్స్ 40,000 మార్క్ దాటింది. గం.11.30 సమయానికి 530 పాయింట్ల ఎగిసి 40,288 పాయింట్లను తాకింది. పదకొండున్నర సమయానికి 423 పాయింట్లు ఎగిసి 40,180 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

పుంజుకున్న రిలయన్స్

పుంజుకున్న రిలయన్స్

నిఫ్టీ ఆటో 1.62 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.98 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.36 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.92 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.66 శాతం, నిఫ్టీ ఐటీ 0.82 శాతం, నిఫ్టీ మీడియా 0.08 శాతం, నిఫ్టీ మెటల్ 1.65 శాతం, నిఫ్టీ ఫార్మా 0.85 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.64 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.08 శాతం లాభపడ్డాయి. కేవలం నిఫ్టీ రియాల్టీ 0.34 శాతం నష్టపోయింది. నిన్న నిఫ్టీ రియాల్టీ భారీగా లాభపడింది.

ఐచర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా లాభపడ్డాయి.

నిన్న దాదాపు 9 శాతం నష్టపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర ఈ రోజు 1.40 శాతం పెరిగి రూ.1,903.70 పలికింది.

సెన్సెక్స్ 30లో కేవలం మూడు షేర్లు మాత్రమే నష్టపోయాయి.

ఐటీ స్టాక్స్ జంప్

ఐటీ స్టాక్స్ జంప్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1.74 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.44 శాతం, టెక్ మహీంద్ర 0.24 శాతం, విప్రో 1.16 శాతం, మైండ్ ట్రీ 1.59 శాతం, కోఫోర్జ్ 1.61 శాతం లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ స్టాక్ మాత్రం 0.36 శాతం నష్టపోయింది.

కాడిలా హెల్త్ కేర్ దాదాపు 8 శాతం లాభపడి 52 వారాల గరిష్టాన్ని తాకింది. కాడిలా సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలు భారీగా ఎగిశాయి. దీంతో స్టాక్స్ లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ స్టాక్ 1 శాతం ఎగిసింది. నిఫ్టీ మెటల్‌లో జిందాల్ స్టీల్, హిండాల్కో స్టాక్స్ 3 శాతానికి పైగా లాభపడ్డాయి.

English summary

భారీ లాభాల్లో మార్కెట్లు: సెన్సెక్స్ 530 పాయింట్లు జంప్, పుంజుకున్న రిలయన్స్ స్టాక్ | Sensex jumps 450 points, Nifty above 11,800: banks lead, ICICI Bank top gainer

Among sectors, auto, bank, metal and pharma indices rose 1 percent each. BSE Midcap and Smallcap indices rose 0.7 percent each.
Story first published: Tuesday, November 3, 2020, 11:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X