For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫలితాలకు ముందు రిలయన్స్ జంప్, లాభాల్లోకి మార్కెట్లు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(అక్టోబర్ 30) లాభాల్లో ఉన్నాయి. వరుసగా 2 రోజుల నష్టం అనంతరం అక్టోబర్‌లో చివరి రోజు నేడు నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 50.71 పాయింట్లు(0.13%) నష్టపోయి 39,699.14 వద్ద, నిఫ్టీ 7.90 పాయింట్లు( 0.07%) నష్టపోయి 11,662.90 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 137 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ 11,700 మార్క్ క్రాస్ చేసింది. 554 షేర్లు లాభాల్లో, 285 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 52 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. నేడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ ఫలితాలు విడుదలవుతున్నాయి.

భారతీయులకు ట్రంప్ మరో షాక్? H1B వీసా లాటరీ పద్ధతిపై కీలక నిర్ణయం!భారతీయులకు ట్రంప్ మరో షాక్? H1B వీసా లాటరీ పద్ధతిపై కీలక నిర్ణయం!

ఫలితాలకు ముందు లాభాల్లో రిలయన్స్

ఫలితాలకు ముందు లాభాల్లో రిలయన్స్

ఉదయం గం.10 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐవోసీ, అదానీ పోర్ట్స్, నెస్ట్లే ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉన్నాయి.

ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ స్టాక్ సానుకూలంగా ఉంది. 0.89 శాతం ఎగిసి రూ.2,045 వద్ద ట్రేడ్ అయింది.

శ్రీరామ్ ట్రాన్సుపోర్ట్ ఫైనాన్స్ సెప్టెంబర్ త్రైమాసిక నికర లాభం 11 శాతం క్షీణించింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో కెనరా బ్యాంకు నికర లాభం రూ.444 కోట్లుగా ఉంది.

ఇండిగో వరుసగా మూడో త్రైమాసికంలో నష్టాలను ప్రకటించింది.

ఎయిరిండియా బిడ్డింగ్ డెడ్ లైన్‌ను డిసెంబర్ 14వ తేదీ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

స్టాక్స్ అన్నీ లాభాల్లో

స్టాక్స్ అన్నీ లాభాల్లో

టీసీఎస్ 1.32 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2 శాతం, ఇన్ఫోసిస్ 0.20 శాతం, టెక్ మహీంద్ర 1.70 శాతం, విప్రో 1.60 శాతం, మైండ్ ట్రీ 2.52 శాతం, కోఫోర్జ్ స్టాక్ 2.56 శాతం లాభపడ్డాయి. ఐటీ స్టాక్స్ అన్నీ లాభాల్లో ఉన్నాయి.

నిఫ్టీ 11,700 పాయింట్లకు పైగా ఎగిసింది.

మారుతీ సుజుకీ ఫలితాల అనంతరం నేడు ఈ స్టాక్ 1 శాతానికి పైగా పడిపోయింది.

వొడాఫోన్ ఐడియా స్టాక్ 3.59 శాతం ఎగిసింది.

టాటా మోటార్స్ 1.52 శాతం లాభపడింది.

నిఫ్టీ ఎనర్జీ 1.76 శాతం లాభాల్లో ఉంది.

నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ.. ఇలా దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఇలా..

అంతర్జాతీయ మార్కెట్లో ఇలా..

అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. అంతకుముందురోజు భారీగా నష్టపోయిన అమెరికా స్టాక్స్ తాజాగా ఎగిశాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావర్జే 139 పాయింట్లు (0.52 శాతం) లాభపడి 26,659.11 వద్ద, ఎస్ అండ్ పీ 39 పాయింట్లు(1.19 శాతం) ఎగిసి 3,310.11 వద్ద, నాస్‌డాక్ కాంపోజిట్ 180 పాయింట్లు (1.64 శాతం) ఎగిసి 11,185.59 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. యూఎస్ వ్యాల్యూమ్ ఎక్స్చేంజ్ 9.74 బిలియన్ షేర్లుగా ఉంది.

ఆసియా మార్కెట్లు కాస్త మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ నిక్కీ 0.8 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ 1.7 శాతం, ఆస్ట్రేలియా ASX200 0.24 శాతం, సింగపూర్ ఎస్జీఎక్స్ 0.22 శాతం క్షీణించాయి. అయితే సౌత్ కొరియా కోస్పి 1 శాతం, భారత్ నిఫ్టీ 70 పాయింట్ల మేర లాభాల్లో ఉంది.

English summary

ఫలితాలకు ముందు రిలయన్స్ జంప్, లాభాల్లోకి మార్కెట్లు | Sensex jumps 150 points, Nifty above 11,700

All the sectoral indices are trading in the green. Coal India, IOC, NTPC, Adani Ports and BPCL are among major gainers on the Nifty.
Story first published: Friday, October 30, 2020, 10:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X