ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(నవంబర్ 17) సరికొత్త రికార్డును తాకింది. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 319.77 పాయింట్లు (0.73%) లాభపడి 43,957.75 వద్ద, నిఫ్టీ 82.20 పాయింట్లు(0.64%) ఎగిసి 12,862.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 866 షేర్లు లాభాల్లో, 330 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 99 షేర్లలో ఎలాంటి మార్పులేదు. శుక్రవారం డాలర్ మారకంతో రూపాయి 74.60 వద్ద క్లోజ్ అయింది. ఈరోజు 17 పైసలు బలపడి 74.43 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ మెటల్ 2 శాతం ఎగిసింది. ఐటీ, ఫార్మా స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

44,000 మార్క్ దాటిన సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు ఓ దశలో 44,000 మార్కును దాటింది. గతవారం 43వేల మార్క్ దాటి రికార్డును సృష్టించిన సెన్సెక్స్ పది సెషన్లల లోపే 44వేల మార్కును అందుకోవడం గమనార్హం. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో నిలువలేకపోయింది. ఓ సమయంలో 44,161ని తాకింది. క్రితం సెషన్లో 43,831 వద్ద క్లోజ్ అయింది. మధ్యాహ్నం గం.12 సమయానికి 155 పాయింట్లు లాభపడి 43,793 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 44 పాయింట్లు ఎగిసి 12,824 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా 12,930ని తాకింది.

లాభాల్లో ఫైనాన్షియల్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ డౌన్
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6.86 శాతం, టాటా మోటార్స్ 3.96 శాతం, ఎస్బీఐ 3.03 శాతం, లార్సన్ 2.90 శాతం, HDFC లైఫ్ 2.63 శాతం ఎగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో BPCL 4.05 శాతం, హీరో మోటో కార్ప్ 2.83 శాతం, IOC 1.96 శాతం, NTPC 1.98 శాతం, ఓఎన్జీసీ 1.65 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.36 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.13 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.97 శాతం, నిఫ్టీ మెటల్ 2.50 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 1.28 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.23 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.98 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎనర్జీ 0.39 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.20 శాతం, నిఫ్టీ ఐటీ 0.35 శాతం, నిఫ్టీ మీడియా 1.17 శాతం, నిఫ్టీ ఫార్మా 0.54 శాతం నష్టపోయాయి.
ఐటీ స్టాక్స్ డీలా పడ్డాయి. టీసీఎస్ 0.23 శాతం, టెక్ మహీంద్ర 0.42 శాతం, విప్రో 1.17 శాతం, మైండ్ ట్రీ 0.62 శాతం లాభపడ్డాయి.
హెచ్సీఎల్ టెక్ 1.60 శాతం, ఇన్ఫోసిస్ 1.38 శాతం, కోఫోర్జ్ 1.03 శాతం నష్టపోయింది.

అందుకే మార్కెట్లు జంప్
పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ వ్యాక్సీన్ పైన వివిధ ఫార్మా దిగ్గజాల ప్రకటన మార్కెట్లకు సరికొత్త ఊపిరులూదుతోంది. ఇప్పటికి మూడు నాలుగు ఫార్మా సంస్థలు తమ ట్రయల్స్ 90 శాతం అంతకుమించి ఫలితాలు సాధించినట్లు వెల్లడించాయి. ఇక, మన దేశంలో కరోనా కేసులు తగ్గడంతో పాటు రికవరీ రేటు భారీగా పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు వేగవంతంగా పుంజుకుంటున్న సంకేతాలు రావడంతో పాటు రేటింగ్ ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. ఇది మార్కెట్ల దూకుడుకు కారణమైంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications