లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 270 పాయింట్లు జంప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (మే 6) లాభాల్లో ముగిశాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ ముగిసిన దగ్గర నుండి మార్కెట్ సానుకూలంగా ట్రేడ్ అవుతోంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటం సూచీలకు బలాన్నిచ్చాయి. పైగా అమెరికా, ఐరోపాలు కరోనా నుండి కోలుకోవడంతో అక్కడి మార్కెట్లు జంప్ చేయడం కలిసి వస్తోంది. ఈ రోజు ఐరోపా మార్కెట్లు కంపెనీల ఫలితాలతో సరికొత్త శిఖరాలను తాకాయి. పలు ఐరోపా బ్యాంకులు విడుదల చేసిన భవిష్యత్ అంచనాలు సానుకూలంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.
ఊగిసలాట నుండి భారీ లాభాల్లో...
సెన్సెక్స్ నేడు 48,877.78 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,011.31 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,614.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 272.21 (0.56%) పాయింట్లు ఎగిసి 48,949.76 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,668.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,743.90 వద్ద గరిష్టాన్ని, 14,611.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 106.95 (0.73%)
పాయింట్లు ఎగిసి 14,724.80 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 5.13 శాతం, హీరో మోటో కార్ప్ 4.49 శాతం, విప్రో 4.42 శాతం, టాటా మోటార్స్ 3.34 శాతం, ఐచర్ మోటార్స్ 2.99 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.28 శాతం, యూపీఎల్ 1.20 శాతం, ఎన్టీపీసీ 0.82 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.78 శాతం, ONGC 0.77 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, సిప్లా, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యు స్టీల్, రిలయన్స్ ఉన్నాయి.
రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.73 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.27 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.78 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.13 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.66 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.63 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.44 శాతం, నిఫ్టీ ఐటీ 1.83 శాతం, నిఫ్టీ ఐటీ 1.35 శాతం, నిఫ్టీ మెటల్ 2.51 శాతం, నిఫ్టీ మీడియా 0.17 శాతం, నిఫ్టీ మెటల్ 1.83 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.71 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 0.23 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 1.17 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.06 శాతం నష్టపోయాయి.