స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 8) లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండు వారాలు నష్టపోయిన మార్కెట్లు దీపావళి వారం లాభాల్లో ముగిశాయి. ఈ వారం కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 0.90 మేర లాభపడ్డాయి. నేడు ఫార్మా రంగం మాత్రమే నష్టాల్లో ముగిసింది. మిగతా అన్ని కూడా లాభపడ్డాయి. పీఎస్యు బ్యాంకు, ఐటీ, మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ సూచీలు ఒక శాతం నుండి రెండు శాతం మేర లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 1.2 శాతం, స్మాల్ క్యాప్ 0.78 శాతం ఎగిసింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, జేకే బ్యాంకులు భారీగా లాభపడంతో నిఫ్టీ పీఎస్యు బ్యాంకు ఒక శాతం మేర లాభపడింది. నిఫ్టీ మెటల్ కూడా ఒక శాతం ఎగిసింది. FY22లో భారత జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని బ్రిక్ వర్క్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. విజిల్ బ్లోయర్స్ కేసు నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్స్ భారీగా నష్టపోయాయి.

ఇండస్ఇండ్ బ్యాంకు విజిల్ బ్లోయర్ ఎఫెక్ట్
ఇండస్ఇండ్ బ్యాంకులో రుణాల పునరుద్ధరణపై విజిల్ బ్లోయర్స్ చేసిన ఆరోపణలు దానిపై సంస్థ ఇచ్చిన వివరణ నేపథ్యంలో బ్యాంకు షేర్లు ఓ దశలో 12 శాతానికి పైగా కుంగాయి. బీఎస్ఈలో స్టాక్ ధర 12.40 శాతం కుంగి రూ.1,041.60కు చేరుకుంది. ఎన్ఎస్ఈలో రూ.12.40 శాతం పతమైంది. మధ్యాహ్నం 12:36 గంటల సమయంలో కనిష్ఠాల నుండి స్వల్పంగా కోలుకున్నప్పటికీ 10.52 శాతం నష్టంతో రూ.1,063.95 శాతం వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంకు షేర్ 52 వారాల గరిష్టం రూ.1,242.00, 52 వారాల కనిష్టం రూ.735.05.

సెన్సెక్స్ 478 పాయింట్లు జంప్
సెన్సెక్స్ నేడు 60,385.76 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,609.16 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,779.19 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,040.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,087.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,836.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 477.99 (0.80%) పాయింట్లు ఎగిసి 60,545.61 పాయింట్ల వద్ద, నిఫ్టీ 151.75 (0.85%) పాయింట్లు ఎగిసి 18,068.55 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో 22 షేర్లు లాభపడ్డాయి. రాణించిన వాటిలో టైటాన్ అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్, HDFC, NTPC, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఎస్బీఐ, మారుతీ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

అందుకే మార్కెట్లు జంప్
ఉదయం నుండి ఊగిసలాటలో పయనించిన మార్కెట్లు మధ్యాహ్నం పూర్తిగా లాభాల్లోకి వచ్చాయి. బజాజ్ ఫిన్ సర్వ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, HDFC, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టైటాన్ వంటి దిగ్గజ కంపెనీలకు కొనుగోళ్లు వెల్లువెత్తాయి. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ఠాల నుండి ఓ దశలో ఏకంగా 800 పాయింట్లకు పైగా పుంజకుంది.
పండగ సీజన్ నేపథ్యంలో రిటైల్ విక్రయాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. దీంతో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. వీటితో పాటు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కలిసి వచ్చాయి. పెట్రోల్ ధరల తగ్గింపు, అమెరికాలో ఉద్యోగ కల్పన పుంజుకోవడం వంటి పరిణామాలు కూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications