స్టాక్ మార్కెట్లు బుధవారం (జూన్ 1) ఊగిసలాటలో ఉన్నాయి. నిన్న భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేడు కూడా అదే ధోరణితో కొనసాగుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫ్యూచర్స్ నేడు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. దీంతో ఉదయం అతి స్వల్ప లాభాల్లో లేదా ఫ్లాట్గా ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. మొత్తానికి సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాటలో ఉన్నాయి. ఆసియా సూచీలు కూడా ప్రతికూలంగానే కదులుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యోల్భణ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తోంది.
క్రితం సెషన్లో సెన్సెక్స్ 55,566 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ 55,588 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,791 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,407 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,594 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,649 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,537 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.15 సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడి 55,574 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు ఎగిసి 16,586 పాయింట్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్ నేడు 400 పాయింట్ల పైకి, కిందకు కదలాడింది.

సర్టిఫైయింగ్ అథారిటీ కంపెనీ ఈ-ముద్ర షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్చేంజీలో నమోదవుతున్నాయి. ఐపీవోలో ఈ కంపెనీ షేర్లకు 2.7 రెట్ల స్పందన లభించింది. రష్యాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్ మార్క్ మార్చి త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దీంతో ఫార్మా స్టాక్స్ సానుకూలంగానే ఉంటాయని అంచనా. ఎల్ఐసీ షేర్ నేడు స్వల్పంగా లాభపడి రూ.812 వద్ద ట్రేడ్ అవుతోంది.
More From GoodReturns

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ ప్రకటనతో అన్ని రంగాలు విలవిల..ఎంతలా అంటే..

రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు.. బ్యాంకులు కూడా పనిచేయవు.. ఈ రోజు పతనానికి విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications