భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. వరుస రెండు రోజుల లాభాల అనంతరం, నిన్న మార్కెట్లు నష్టపోయాయి. నేడు (గురువారం, మే 19) భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా క్షీణించింది. ఉదయం సెన్సెక్స్ 53,070 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,356 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,053 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ 968 పాయింట్లు నష్టపోయి 53,240 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 292 పాయింట్లు క్షీణించి 15,948 పాయింట్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్, నిఫ్టీలు 1.80 శాతం మేర క్షీణించాయి.
అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, రియాల్టీ, మెటల్, ఐటీ సూచీలు 1 శాతం నుండి 3 శాతం మేర క్షీణించాయి. అత్యధికంగా పవర్, యుటిలిటీ సూచీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి.సెన్సెక్స్ క్రితం సెషన్లో 54,208 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో 53,000 స్థాయికి పడిపోయింది. ఈ మార్కు దిగువకు మాత్రం వెళ్లలేదు. కానీ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లతో దాదాపు 9000 పాయింట్లు తక్కువగా ఉంది.

అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇది మన సూచీలపై ప్రభావం చూపింది. దీనికి తోడు మార్కెట్ తీరును అంచనా వేసే వీఐఎక్స్ సూచీ 9 శాతం పెరిగింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఐరోపా ఖండంలోని ఫైనాన్షియల్ హబ్ యూకేలో ద్రవ్యోల్భణం 40 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్ పైన ప్రభావం చూపింది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications