భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 52,323 పాయింట్ల వద్ద క్లోజ్
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జూన్ 17) నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత ఓ సమయంలో భారీ నష్టాల్లోకి వెళ్లింది. చివరకు 180 పాయింట్ల వరకు నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్. సెన్సెక్స్ ఓ సమయంలో 500 పాయింట్ల వరకు నష్టపోయింది. అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచనుందనే సంకేతాలు భారత్, ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. అయితే ప్రస్తుతానికి వడ్డీ రేటును దాదాపు సున్నా వద్ద ఉంచి ప్రతినెలా 120 బిలియన్ డాలర్లు విలువైన బాండ్స్ కొనుగోలు చేయనుంది. చమురు ధరల్లో పెరుగుదల కూడా సూచీలపై ప్రభావం చూపాయి.
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ ఉదయం 52,122.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,523.88 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,040.51 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,648.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,769.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,616.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 178.65 (0.34%) పాయింట్లు నష్టపోయి 52,323.33 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 76.15 (0.48%) పాయింట్లు నష్టపోయి 15,691.40 పాయింట్ల వద్ద ముగిసింది.
గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్స్ 1.78 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.38 శాతం, టీసీఎస్ 1.33 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 1.24 శాతం, HDFC లైఫ్ 1.18 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 8.46 శాతం, టాటా స్టీల్ 3.36 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.92 శాతం, హిండాల్కో 2.89 శాతం, ఐచర్ మోటార్స్ 2.46 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.48 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.41 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.03 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.03 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.30 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.01 శాతం, నిఫ్టీ మీడియా 1.09 శాతం, నిఫ్టీ మెటల్ 2.32 శాతం, నిఫ్టీ ఫార్మా 0.94 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 1.42 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.65 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.18 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.14 శాతం, నిఫ్టీ ఐటీ 0.57 శాతం లాభపడింది.