భారీ నష్టాల్లో మార్కెట్లు: ఇన్ఫీ హిట్, దెబ్బకొట్టింది ఇవే: బార్డర్ టెన్షన్, ఫెడ్ సహా కారణాలివే

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(సెప్టెంబర్ 17) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం 275 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్, ఆ తర్వాత కాస్త నష్టాలు తగ్గినట్లుగానే కనిపించినా, తిరిగి అంతకుమించిన నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 323.00 (0.82%) పాయింట్లు నష్టపోయి 38,979.85 వద్ద, నిఫ్టీ 88.45 (0.76%) పాయింట్లు కోల్పోయి 11,516.10 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.24 శాతం, 0.53 శాతం మేర నష్టపోయింది. బీఎస్ఈ హెల్త్‌కేర్, ఐటీ, టెక్ షేర్లు మినహా మిగతా రంగాలు నష్టాల్లో ముగిశాయి.

ఆ షేర్లు దూకుడు

ఆ షేర్లు దూకుడు

మోస్ట్ యాక్టివ్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, టాటా మోటార్స్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి. కొన్ని ఐటీ షేర్లు దూకుడును కొనసాగించాయి. ఇన్ఫోసిస్ షేర్ ఈరోజు 0.92 శాతం పెరిగి రూ.1,011, హెచ్‌సీఎల్ టెక్ షేర్ ధర 2.16 శాతం పెరిగి రూ.806 వద్ద ముగిసింది. అయితే టీసీఎస్ షేర్ ధర 1.48 శాతం, విప్రో షేర్ ధర 0.40 శాతం, టెక్ మహీంద్రా 0.57 శాతం మేర క్షీణించాయి.

హ్యాపీయెస్ట్ మైండ్ లిస్టింగ్

హ్యాపీయెస్ట్ మైండ్ లిస్టింగ్

ఈ రోజు హ్యాపియెస్ట్ మైండ్ లిస్టింగ్ అయింది. ఇష్యూ చేసిన ధరతో పోలిస్తే ఈ షేర్ ధర 135 శాతం లాభాల్లో ముగిసింది. అయినప్పటికీ సెన్సెక్స్ 39వేల మార్క్ దిగువనే క్లోజ్ అయింది. ప్రధానంగా ఫైనాన్షియల్ రంగంతో పాటు రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్ భారీగా నష్టపోవడానికి కారణమని చెబుతున్నారు. ఆసియా దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు 1.23 శాతం మేర క్షీణించి రూ.2,295 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంకు 253 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 42 పాయింట్లు క్షీణించింది.

నిఫ్టీ హెవీవెయిట్స్‌లో ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడింది. రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నష్టాల్లో ముగిశాయి.

ఆర్థిక పునరుద్ధర ఆందోళనల నేపథ్యంలో మెటల్, స్టీల్ కంపెనీలు నష్టపోయాయి.

కోవిడ్ వ్యాక్సీన్ పైన రష్యాతో ఒప్పందం నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.

టాటా మోటార్స్ 2 శాతం మేర నష్టపోయింది. ఈయూలో జేఎల్ఆర్ కొత్త కారు సేల్స్ సేల్స్ పడిపోయాయి. ఈ ప్రభావం పడింది.

హ్యాపీయెస్ట్ మైండ్ ఇష్యూ ధర రూ.166 కాగా, రూ.371 వద్ద క్లోజ్ అయింది.

అందుకే నష్టాల్లో మార్కెట్లు...

అందుకే నష్టాల్లో మార్కెట్లు...

అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ అంచనా కంటే కాస్త వేగంగానే కోలుకుంటుందని చెప్పిన ఫెడ్, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు ఫెడ్ రేట్లు పెంచేది లేదని, 2023 వరకు ఉలాగే ఉండవచ్చునని వెల్లడించాయి. మరో రెండేళ్ల పాటు ఫెడ్ వడ్డీ రేట్లు పెరగవు. ప్రధానంగా ఈ ప్రభావం మార్కెట్లపై పడింది. మరోవైపు, చైనా-భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గలేదని ప్రభుత్వం చెప్పింది. అలాగే, దేశంలో కరోనా కేసులు ఇతర దేశాలతో పోలిస్తే వేగంగా పెరుగుతున్నాయి. ఈ అంశాలు కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+