లాభాల్లో స్టాక్ మార్కెట్లు, రిలయన్స్ ఎం-క్యాప్ రూ.12 లక్షల కోట్లు
ముంబై:
స్టాక్
మార్కెట్లు
మంగళవారం
లాభాల్లో
ప్రారంభమయ్యాయి.
ఉదయం
గం.9.16
సమయానికి
సెన్సెక్స్
63.67
పాయింట్లు
లేదా
0.17%
ఎగిసి
36,550.95,
నిఫ్టీ
13.30
పాయింట్లు
లేదా
0.12%
లాభపడి
10,777
వద్ద
ట్రేడింగ్
ప్రారంభించింది.
595
షేర్లు
లాభాల్లో,
448
షేర్లు
నష్టాల్లో
ప్రారంభం
కాగా
71
షేర్లలో
ఎలాంటి
మార్పులేదు.
రూపాయి
డాలర్
మారకంతో
74.70
వద్ద
ఫ్లాట్గా
ప్రారంభమైంది.
అంతకుముందు
సెషన్లో
76.68
వద్ద
ముగిసింది.
కరోనా దెబ్బతో కుప్పకూలిన ఆ దేశ ఎకానమీ, శాలరీ లేక 20 రాత్రులు వీధుల్లోనే
టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐచర్ మోటార్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
ఇదిలా ఉండగా, జియో ప్లాట్ఫాంలోకి వరుసగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తోన్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఓ దశలో ఈ కంపెనీ షేర్ ధర 3.94 శాతం పెరిగి రూ.1,858.10కి చేరుకుంది. చివరకు 3.57 శాతం లాభంతో రూ.1,851.40 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.40,508 కోట్లు పెరిగి రూ.11,73,677 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ పార్టీ పెయిడప్ షేర్లు రూ.40,000 కోట్లు కలుపుకుంటే మార్కెట్ వ్యాల్యూ రూ.12.14 లక్షల కోట్లకు చేరింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం గం.11.00 సమయానికి ఈ కంపెనీ షేర్ ధర 1.33 శాతం తగ్గి రూ.1827.20 వద్ద ఉంది.