భారీ నష్టాల నుండి భారీ లాభాల్లోకి మార్కెట్లు: 90 పాయింట్లు అప్ అండ్ డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(జూన్ 21) భారీ నష్టాల్లో ప్రారంభమై, చివరకు లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడింది. దేశీయంగా కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నేటి ప్రారంభ సెషన్లో సూచీలు భారీగా నష్టపోయాయి.
అయితే ఆ తర్వాత క్రమంగా లాభాల్లోకి వచ్చాయి. చివరకు 230 పాయింట్ల లాభాల్లో ముగిసింది సెన్సెక్స్. ఇంధన, రియాల్టీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఇన్ఫ్రా రంగాల షేర్ల మద్దతుతో అనూహ్యంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్ల మేర పైకి కిందకు కదలాడింది.
నష్టాల నుండి లాభాల్లోకి...
సెన్సెక్స్ ఉదయం 51,887.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,629.18 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,740.19 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,525.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,765.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,505.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 63.15 (0.40%) పాయింట్లు లాభపడి 15,746.50 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 230.01 (0.44%) పాయింట్లు ఎగిసి 52,574.46 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.29 శాతం, ఎన్టీపీసీ 3.92 శాతం, టైటాన్ కంపెనీ 1.84 శాతం, ఎస్బీఐ 1.66 శాతం, HDFC లైఫ్ 1.35 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్ 4.43 శాతం, విప్రో 1.39 శాతం, హిండాల్కో 1.01 శాతం, టాటా మోటార్స్ 0.92 శాతం, మారుతీ సుజుకీ 0.85 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, రిలయన్స్, టాటా మోటార్స్ ఉన్నాయి.
రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.40 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.85 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 0.28 శాతం, నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 0.91 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.37 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.70 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.25 శాతం, నిఫ్టీ మీడియా 0.51 శాతం, నిఫ్టీ మెటల్ 1.12 శాతం, నిఫ్టీ ఫార్మా 0.37 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 4.11 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.33 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.90 శాతం లాభపడ్డాయి.