For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల నుండి స్వల్ప లాభాల్లోకి... నిఫ్టీ 14,876 పాయింట్ల వద్ద..

|

స్టాక్ మార్కెట్లు గురువారం (ఏప్రిల్ 8) భారీ లాభాల్లో ప్రారంభమై, చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నుండి లాభాల్లోనే పైకి, కిందకు కదలాడాయి. అయితే చివరి అరగంటలో ఓ సమయంలో నష్టాల్లోకి వెళ్లి, ఆందోళనకు గురి చేసినప్పటికీ, మళ్లీ కాస్త పైకి ఎగబాకింది. ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఇవ్వెస్టర్లు మధ్యాహ్నం నుండి ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా కీలక రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఒత్తిడికి గురైన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి.

చివరకు సెన్సెక్స్

చివరకు సెన్సెక్స్

సెన్సెక్స్ ఉదయం 49,885.26 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,118.08 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,581.71 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నిన్న 49,661.76 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో 360 పాయింట్ల మేర కూడా లాభపడింది. చివరకు సెన్సెక్స్ 84.45 (0.17%) పాయింట్లు ఎగిసి 49,746.21 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 14,875 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,984 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,821 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 54.75 (0.37%) పాయింట్లు ఎగిసి 14,873.80 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్ 9.21 శాతం, టాటా స్టీల్ 4.98 శాతం, శ్రీసిమెంట్స్ 4.47 శాతం, టైటాన్ కంపెనీ 3.78 శాతం, హిండాల్కో 3.69 శాతం లాభపడ్డాయి.

నేటి టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 1.13 శాతం, సన్ ఫార్మా 1.09 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 1.09 శాతం, ఓఎన్జీసీ 1.00 శాతం, HDFC బ్యాంకు 1.00 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్ 0.37 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.48 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.22 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.42 శాతం, నిఫ్టీ ఐటీ 1.18 శాతం, నిఫ్టీ మీడియా 0.35 శాతం, నిఫ్టీ మెటల్ 3.92 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.81 శాతం లాభపడ్డాయి.నిఫ్టీ బ్యాంకు 0.63 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.32 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.34 శాతం, నిఫ్టీ ఫార్మా 0.04 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.85 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.63 శాతం నష్టపోయాయి.

English summary

భారీ లాభాల నుండి స్వల్ప లాభాల్లోకి... నిఫ్టీ 14,876 పాయింట్ల వద్ద.. | Sensex closes marginally higher, Nifty at 14,876

The Sensex ended at 49,746.21, up 84.45 points, or 0.17%, while the Nifty was at 14,873.80, up 54.75 points, or 0.37%. Among broader indices, the BSE midcap and smallcap closed at 0.58% and 0.80%, respectively. The Nifty midcap 100 and smallcap 100 ended the day at 0.53% and 1.24%, respectively.
Story first published: Thursday, April 8, 2021, 17:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X