భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 50,000 క్రాస్
2021-22 కొత్త ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిసిపడ్డాయి. సంవత్సరారంభంలోనే అదరగొట్టాయి. మెటల్, ఫైనాన్షియల్ స్టాక్స్ అండతో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. దీంతో సెన్సెక్స్ తిరిగి 50వేల మార్కును క్రాస్ చేసింది. గత ఐదు సెషన్లుగా సూచీలు భారీ నష్టాల్లో లేదా భారీ లాభాల్లో ఉంటున్నాయి. గతవారం చివరి సెషన్లో, ఈ వారం తొలి సెషన్లో కలిపి దాదాపు 1600 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది. తర్వాత వరుస రెండు రోజుల్లో 1700 పాయింట్ల మేర లాభపడింది. నిన్న 600 పాయింట్లకు పైగా నష్టపోగా, నేడు 500 పాయింట్లు ఎగిసింది.
సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్
సెన్సెక్స్ నేడు ఉదయం 49,868.53 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,092.48 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,478.53 తాకింది. నేడు సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా అటుఇటు కదలాడింది. చివరకు 520.68 (1.05%) పాయింట్లు లాభపడి 50,029.83 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,798.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,883.20 పాయింట్ల గరిష్టాన్ని, 14,692.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 176.65 (1.20%) పాయింట్లు ఎగిసి 14,867.35 వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్ 8.60 శాతం, హిండాల్కో 7.16 శాతం, టాటా స్టీల్ 6.31 శాతం, అదానీ పోర్ట్స్ 4.82 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.07 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HUL 1.33 శాతం, HDFC లైఫ్ 0.75 శాతం, నెస్ట్లే 0.48 శాతం, HDFC బ్యాంకు 0.46 శాతం, టీసీఎస్ 0.40 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, HDFC బ్యాంకు, JSW స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్ ఉన్నాయి.
ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి.
రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.20 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.14 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.62 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.66 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.82 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ స్టాక్స్ 1.23 శాతం, నిఫ్టీ ఐటీ 0.49 శాతం, నిఫ్టీ మీడియా 2.27 శాతం, నిఫ్టీ మెటల్ 5.33 శాతం, నిఫ్టీ ఫార్మా 0.85 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 2.63 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.49 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.85 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.16 శాతం నష్టపోయాయి.