ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం(అక్టోబర్ 8) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 386.55 పాయింట్లు (0.97%) లాభపడి 40,265.50 వద్ద, నిఫ్టీ 110.60 పాయింట్లు(0.94%) లాభపడి 11,849.50 వద్ద ప్రారంభమైంది. 725 షేర్లు లాభాల్లో, 235 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 45 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న టీసీఎస్ ఫలితాల నేపథ్యంలో ఐటీ స్టాక్స్ 4 శాతానికి పైగా లాభప్డాయి. మెటల్, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం లాభపడ్డాయి.

40,000 మార్క్ దాటిన సెన్సెక్స్
సెన్సెక్స్ 40,000 మార్క్ దాటింది. ఉదయం గం.11.31 సమయంలో సెన్సెక్స్ 560 పాయింట్లు లాభపడి 40,440 వద్ద ట్రేడ్ అయింది.
మధ్యాహ్నం గం.11.25 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో గెయిల్, ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, టైటాన్ కంపెనీ, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి.

మార్కెట్ లాభాలకు కారణాలు
వివిధ కారణాలతో మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. నిన్న టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. దీంతో ఐటీ స్టాక్స్ దుమ్ము రేపుతున్నాయి. ఈ ఫలితాల ద్వారా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మరింత వేగంగా తెరుచుకుంటున్నట్లుగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ప్రధానంగా సెప్టెంబర్ నెలలో కార్యకలాపాలు పెరిగినట్లు ఇటీవల సర్వేలు వెల్లడించాయి.
ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(FII) ఇన్-ఫ్లో పెరుగుతున్నాయి. అక్టోబర్ 7వ తేదీ నాటికి నికర కొనుగోలు షేర్లు రూ.1,093.81 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్ 5న రూ.236.73 కోట్లు, అక్టోబర్ 6న రూ.1,101.76 కోట్లుగా ఉంది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది.
ఆగస్ట్ నెలలో కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ నుండి రూ.1 లక్ష కోట్లకు పైగా మొత్తాన్ని జనరేట్ చేశాయి. ఇది 64 శాతం పెరిగింది. ఇలా పలు అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచి, మార్కెట్లు భారీ లాభాల్లో ఉండటానికి కారణమైంది.

ఎగిసిపడిన ఐటీ స్టాక్స్
నిన్న టీసీఎస్ ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ స్టాక్స్ నేడు 5 శాతానికి పైగా లాభపడి రూ.2,875 పలికింది. హెచ్సీఎల్ టెక్ షేర్ ధర 4.55 శాతం లాభపడి రూ.865.75 , ఇన్ఫోసిస్ షేర్ వ్యాల్యూ 4.45 శాతం ఎగిసి రూ.1,115.00, టెక్ మహీంద్ర షేర్ వ్యాల్యూ 4.27 శాతం లాభపడి రూ.882, విప్రో షేర్ ధర 5.85 శాతం పెరిగి రూ.355 వద్ద, మైండ్ ట్రీ షేర్ ఏకంగా 10 శాతం పెరిగి రూ.1,527, కోఫోర్జ్ షేర్ 4.76 శాతం పెరిగి రూ.2,509, బిర్లా సాఫ్ట్ షేర్ 3.81 శాతం పెరిగి రూ.203, సొనాటా సాఫ్టువేర్ 5.48 శాతం పెరిగి రూ.336, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేర్ ధర 8.71 శాతం ఎగిసి రూ.2,899 పలికింది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications