40వేలు దాటిన సెన్సెక్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్: TCS సహా కారణాలివే..

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం(అక్టోబర్ 8) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 386.55 పాయింట్లు (0.97%) లాభపడి 40,265.50 వద్ద, నిఫ్టీ 110.60 పాయింట్లు(0.94%) లాభపడి 11,849.50 వద్ద ప్రారంభమైంది. 725 షేర్లు లాభాల్లో, 235 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 45 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న టీసీఎస్ ఫలితాల నేపథ్యంలో ఐటీ స్టాక్స్ 4 శాతానికి పైగా లాభప్డాయి. మెటల్, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం లాభపడ్డాయి.

40,000 మార్క్ దాటిన సెన్సెక్స్

40,000 మార్క్ దాటిన సెన్సెక్స్

సెన్సెక్స్ 40,000 మార్క్ దాటింది. ఉదయం గం.11.31 సమయంలో సెన్సెక్స్ 560 పాయింట్లు లాభపడి 40,440 వద్ద ట్రేడ్ అయింది.

మధ్యాహ్నం గం.11.25 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో గెయిల్, ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, టైటాన్ కంపెనీ, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి.

మార్కెట్ లాభాలకు కారణాలు

మార్కెట్ లాభాలకు కారణాలు

వివిధ కారణాలతో మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. నిన్న టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. దీంతో ఐటీ స్టాక్స్ దుమ్ము రేపుతున్నాయి. ఈ ఫలితాల ద్వారా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మరింత వేగంగా తెరుచుకుంటున్నట్లుగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ప్రధానంగా సెప్టెంబర్ నెలలో కార్యకలాపాలు పెరిగినట్లు ఇటీవల సర్వేలు వెల్లడించాయి.

ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(FII) ఇన్-ఫ్లో పెరుగుతున్నాయి. అక్టోబర్ 7వ తేదీ నాటికి నికర కొనుగోలు షేర్లు రూ.1,093.81 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్ 5న రూ.236.73 కోట్లు, అక్టోబర్ 6న రూ.1,101.76 కోట్లుగా ఉంది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది.

ఆగస్ట్ నెలలో కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ నుండి రూ.1 లక్ష కోట్లకు పైగా మొత్తాన్ని జనరేట్ చేశాయి. ఇది 64 శాతం పెరిగింది. ఇలా పలు అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచి, మార్కెట్లు భారీ లాభాల్లో ఉండటానికి కారణమైంది.

ఎగిసిపడిన ఐటీ స్టాక్స్

ఎగిసిపడిన ఐటీ స్టాక్స్

నిన్న టీసీఎస్ ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ స్టాక్స్ నేడు 5 శాతానికి పైగా లాభపడి రూ.2,875 పలికింది. హెచ్‌సీఎల్ టెక్ షేర్ ధర 4.55 శాతం లాభపడి రూ.865.75 , ఇన్ఫోసిస్ షేర్ వ్యాల్యూ 4.45 శాతం ఎగిసి రూ.1,115.00, టెక్ మహీంద్ర షేర్ వ్యాల్యూ 4.27 శాతం లాభపడి రూ.882, విప్రో షేర్ ధర 5.85 శాతం పెరిగి రూ.355 వద్ద, మైండ్ ట్రీ షేర్ ఏకంగా 10 శాతం పెరిగి రూ.1,527, కోఫోర్జ్ షేర్ 4.76 శాతం పెరిగి రూ.2,509, బిర్లా సాఫ్ట్ షేర్ 3.81 శాతం పెరిగి రూ.203, సొనాటా సాఫ్టువేర్ 5.48 శాతం పెరిగి రూ.336, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేర్ ధర 8.71 శాతం ఎగిసి రూ.2,899 పలికింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+