ఆన్లైన్ మోసాలకి సంబంధించిన మరో కేసులో బెంగళూరుకు చెందిన ఓ సీనియర్ సిటిజన్ బలైయ్యాడు, దింతో అతను ఏకంగా రూ.6.41 కోట్లు కోల్పోయాడు. బాధితురాడి ప్రకారం స్కామర్ వాట్సాప్ ద్వారా అతనితో కనెక్ట్ అవగా ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్ పేరిట స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి నేర్పిస్తామంటూ ఆశ చూపి నిండా ముంచారు.
బెంగుళూరు మిర్రర్ నివేదిక ప్రకారం, బాధితుడికి జూలై 19న వాట్సాప్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయమైనట్లు తెలిపింది. తన పేరు మీరా పటేల్, ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ మెంబర్ అంటూ బాధితుడికి పరిచయం చేసుకుంది. తరువాత "ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్"కి రిప్రజెంటర్స్ అంటూ హార్దిక్ షా అండ్ ఆశిష్ గోయల్ని పరిచయం చేస్తూ ఒక గ్రూప్లోని ఇతరులతో కూడా అతనిని కనెక్ట్ చేసింది. అయితే ఈ సంస్థ ఒక పెట్టుబడి సలహా సంస్థ అని స్కామర్లు అతనికి చెప్పారు. స్కామర్లు అతనితో పరిచయం చేసుకున్న తర్వాత ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించేందుకు ప్లాన్ చేసి మీ పెట్టుబడులపై 700 శాతం ఎక్కువ రాబడి ఇప్పిస్తామని నమ్మకంగా పలికారు.

ఇది నిజమైన గ్రూప్ అని నమ్మి స్టాక్ మార్కెట్ ఇంకా పెట్టుబడుల గురించి మరింత తెలుసుకోవాలనే ఆశతో బాధితుడు వారి మాటలకు పడిపోయాడు. తరువాత స్కామర్లు 15 రోజుల్లో ప్రొఫెషనల్ ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించారు. ఈ సమయంలోనే బాధితుడుని ఇతర గ్రూప్ సభ్యులతో పాటు ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చారు, అ గ్రూప్లో పెట్టుబడి నిపుణులమంటూ స్టాక్ మార్కెట్ గురించి విషయాలను షేర్ చేసుకున్నారు. స్టాక్ సజెషన్స్, IPOలు, బ్లాక్ ట్రేడింగ్పై ట్రైనింగ్ ఇచ్చారని తెలపగా, ఈ ట్రైనింగ్ బాధితుడికి నిజమని అనిపించి వారి స్కామ్లో చిక్కుకున్నాడు.
చివరికి స్కామర్లు పెద్ద మొత్తంలో బాధితుడిని డబ్బు పెట్టుబడిగా పెట్టమని ఒత్తిడి తెచ్చారు. మొదట్లో ప్రిఫరెన్షియల్ స్టాక్, IPO సబ్స్క్రిప్షన్ల కోసం తరువాత లాభాలను అన్లాక్ చేయడానికి హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ బెనిఫిట్స్ కోసం డబ్బులు అవసరమని పేర్కొంటూ దీనికితోడు "సెక్యూరిటీ డిపాజిట్లు" అంటూ మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. దింతో బాధితుడు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభించాడు. అక్కడితో వారు ఆగలేదు.
బాధితునికి తన డబ్బును తిరిగి పొందాలనే కోరికతో స్కామర్ల నుండి పెరుగుతున్న డిమాండ్ వల్ల రూ.70 లక్షలతో సహా రూ. 3.2 కోట్ల లోన్ తీసుకొని ఇంకా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుండి కూడా అప్పు తీసుకున్నాడు. ఇలా అతను మొత్తంగా రూ. 6.41 కోట్లు పెట్టుబడి పెట్టగ ఎలాంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా అవి మాయమ్మయ్యాయి . మీరా పటేల్, ఆమె సహచరులను సంప్రదించడానికి పదేపదే ట్రై చేసిన ఎలాంటి ఫలితం లేదు. దింతో చివరికి అతనికి మోసపోయానని అర్ధమైంది. పోలీసుల విచారణలో భాగంగా స్కామర్లు రాకరాకల ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్స్, లాభాలు వచ్చినట్లు నకిలీ ట్రాన్సక్షన్స్ చూపించే ఫేక్ ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి ఆపరేట్ చేశారని అధికారులు వెల్లడించారని ఒక నివేదికలో పేర్కొంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications