Chandrababu Arrest: మాజీ సీఎం, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్మాక్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో జరిగిన వాడివేడి వాదనల తర్వాత జడ్జి 14 రోజుల పాటు రిమాండుకు చంద్రబాబును పంపారు. దీంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకపక్క పార్టీ శ్రేణులు బంద్ కు పిలుపునివ్వగా.. మరో పక్క భద్రతా కారణాల రీత్యా 144 సెక్షన్ అమలు కొనసాగుతోంది.

అయితే ఈ మెుత్తం పరిణామాల ప్రభావం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీపై ప్రతికూలంగా ఉంది. మధ్యాహ్నం 12.32 గంటల సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ ఎన్ఎస్ఈలో 5.63 శాతం క్షీణించి రూ.256.65 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగే బీఎస్ఈలో స్టాక్ ధర 5.59 శాతం క్షీణించి రూ.256.75 వద్ద ట్రేడవుతోంది.

అయితే ప్రస్తుతం షేర్లలో పెట్టుబడి పెట్టాలా వద్దా అనే దానిపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. కొందరు ఇన్వెస్టర్లు 2024 ఎన్నికల తర్వాత కొనుగోలు చేయటం ఉత్తమం అని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల హీట్ కారణంగా ఏర్పడిన పరిస్థితులతో అమ్మకాల జోరు కొనసాగుతోంది. కంపెనీ షేర్లలో నేడు రేపు ఇదే ధోరణి కొనసాగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ప్రస్తుతం తక్కువ ధరలకు కొనుక్కుని హోల్డ్ చేయటం ద్వారా ఎన్నికల తర్వాత టీడీపీ గెలిస్తే మంచి లాభాలను పొందవచ్చని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications