అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ను విక్రయించలేమని ప్రయివేటు పెట్రోల్ పంప్స్ రిటైల్ డీలర్స్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ అంశంపై కేంద్ర చమురు శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర చమురు శాఖకు జియో-బీపీ, నయారా ఎనర్జీ, షెల్ తదితర రిటైల్ డీలర్లతో కూడిన భారత పెట్రోలియం పరిశ్రమ సమాఖ్య (FIPI) జూన్ 10వ తేదీన లేఖ రాసింది. FIPI ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలను తన సభ్యులుగానే భావిస్తుంటుంది. లీటర్ డీజీల్పై రూ.20 నుండి రూ.25, లీటర్ పెట్రోల్పై రూ.14 నుండి రూ.18 నష్టానికి విక్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా రిటైల్ ధరలను సవరించాలని లేదంటే రిటైల్ వ్యాపారంలో మరిన్ని పెట్టలేని పరిస్థితి అని పేర్కొంది. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. కంపెనీలు మనుగడ సాగించేలా చూడాలని, పెట్టుబడులు వచ్చేలా చేయాలని కోరింది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దశాబ్ద గరిష్టస్థాయికి చేరాయని, కానీ భారత్లో 90 శాతం మార్కెట్ కలిగిన ప్రభుత్వరంగ చమురు సంస్థలు మాత్రం ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను అందుకు అనుగుణంగా పెంచలేదని తెలిపింది. చమురు ధరలో మూడింట రెండువంతులకు సమానంగా ప్రస్తుత రిటైల్ ధరలు ఉన్నాయని పేర్కొంది. ప్రయివేటు సంస్థలు మాత్రమే ధరలు పెంచితే కొనుగోలుదారులు తమ వద్దకు వచ్చే పరిస్థితి ఉండదని, అందుకే నష్టాలను తగ్గించుకోవడానికి అమ్మకాలను పరిమితం చేయవలసి వస్తోందని తెలిపింది. 2021 నవంబర్ నుండి 2022 మార్చి వరకు నాలుగు నెలలకు పైగా ధరలు సవరించకపోవడం వల్ల నష్టాలు వచ్చాయని గుర్తు చేసింది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications