2021-22 సిరీస్ 2 సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం సబ్స్క్రిప్షన్ సోమవారం నుండి ప్రారంభమైంది. తొలి విడత గోల్డ్ బాండ్స్ స్కీం మే 17వ తేదీన ప్రారంభమై, 21వ తేదీన ముగిసింది. ప్రభుత్వం తాజా గోల్డ్ బాండ్ ధరను (ఒక గ్రాముకు) రూ.4,842గా నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. నేటి నుండి (సోమవారం, మే 24) ఐదు రోజుల పాటు సావరీన్ గోల్డ్ బాండ్ స్కీంను ఆఫర్ చేస్తున్నారు.24వ తేదీ నుండి 28 తేదీ వరకు కొనుగోలు చేయవచ్చు. గత ఇష్యూలో గ్రాము బంగారం ధర రూ.4,777గా నిర్ణయించగా, ఈ ఇష్యూలో పెరిగింది. తొలి విడత గోల్డ్ బాండ్ స్కీం కంటే రూ.65 పెరిగింది. రెండో విడత గోల్డ్ బాండ్స్ను జూన్ 1వ తేదీన ఇష్యూ చేస్తారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ సావరీన్ గోల్డ్ బాండ్స్ (SGB)ని ఆఫర్ చేస్తోంది. మే 2021 నుండి 2021 సెప్టెంబర్ వరకు 6 విడతల్లో బాండ్స్ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్స్క్రిప్షన్ కాలానికి ముందు వారంలోని చివరి మూడు వర్కింగ్ డేస్ 999 స్వచ్ఛత బంగారం సగటు ధర ఆధారంగా బాండ్ వ్యాల్యు 1 గ్రాము బంగారానికి రూ.4842ని నిర్ణయించింది.

ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ఏ రెసిడెంట్ అయినా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇండివిడ్యువల్స్, HUF, ట్రస్ట్లు కూడా కొనుగోలు చేయవచ్చు. మైనర్ల తరఫున గార్డియన్ పెట్టుబడిగా పెట్టవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి వోటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాన్ లేదా ట్యాన్, పాస్పోర్ట్ వంటివి అవసరం.
సావరీన్ గోల్డ్ బాండ్ ద్వారా కనీసం ఒక గ్రామును కొనుగోలు చేయాలి. ఇండివిడ్యువల్స్, HUF నాలుగు కిలోల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇతర అర్హత కలిగిన ఎంటిటీలు 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ పీరియడ్ ఎనిమిది సంవత్సరాలు. అయితే ఇన్వెస్టర్లు అయిదేళ్లకు ఉపసంహరించుకోవచ్చు.
ఎస్బీఐ ద్వారా మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లోను గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్బీఐ నియమించిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి కూడా బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
భౌతిక బంగారం డిమాండ్ను తగ్గించడానికి, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చడానికి 2015 నవంబర్ నెలలో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications