రూ.1407 కోట్ల రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, వేదాంతకు సెబి వార్నింగ్

ఆడిట్ కమిటీ నుండి ముందస్తు అనుమతులు తీసుకోకుండా రూ.1,407 కోట్ల విలువైన రిలేటెడ్-పార్టీ ట్రాన్సాక్షన్స్‌ను నిర్వహించినందుకు వేదాంతా లిమిటెడ్‌ను మార్కెట్ రెగ్యులేటరీ సెబీ హెచ్చిరించింది. భవిష్యత్తులో వేదాంతా మరోసారి ఇలాంటి కార్యకలాపాలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సెబీ పేర్కొంది. వేదాంతాకు చెందిన స్వతంత్ర ఆడిటర్స్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక రిపోర్ట్‌లో ఈ ట్రాన్సాక్షన్ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఏ తరహా ట్రాన్సాక్షన్ అనే విషయాన్ని వెల్లడించకుండా సాధారణ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఈ ట్రాన్సాక్షన్‌ను నిర్వహించినట్లు కంపెనీ తెలిపిందని, అక్టోబర్ 28వ తేదీన సెబీ జారీ చేసిన లేఖలో పేర్కొంది.

అందుకే సెబీ నిబంధనలు-2015లోని నిబంధన 23(2) ప్రకారం ఇకపై రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌రు ఆడిట్ కమిటీ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని సెబీ తెలిపింది. కంపెనీ వివరణ అర్థవంతంగా లేదని భావిస్తున్నట్లు తెలిపింది. అలాగే 2020 అక్టోబర్ 3వ తేదీన జరిగిన బోర్డ్ సమావేశం వివరాలను కూడా కంపెనీ ఆలస్యంగా వెల్లడించిందని ఆడిటర్స్ గుర్తించారు. అనుకోని పరిస్థితుల వల్ల వెల్లడించడంలో జాప్యం చేశామని, మున్ముందు ఇలా జరగకుండా చూసుకుంటామని వేదాంతా వివరణ ఇచ్చింది.

 SEBI warns Vedanta of RS 1,407 crore related-party transactions sans nod

పై ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సెబి పేర్కొంది. ఇకపై సెబీ నిర్దేశించిన అన్ని రకాల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని వేదాంతాకు హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+