LIC ఐపీవోకు మార్గం సుగమం, అందుకే సెబీ కీలక నిర్ణయం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ ఇన్సురెన్స్ సంస్థ LIC ఐపీవో రానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫైనాన్స్ బిల్లులో LIC సవరణ చట్టాన్ని పొందుపరచడంతో త్వరలో చట్టసభల ఆమోదానికి రానుంది. LIC ఐపీఓ సలహాదారులుగా డెలాయిట్, ఎస్బీఐ క్యాప్స్ ఉన్నాయి. LIC IPO పరిమాణంలో 10 శాతం వరకు పాలసీదార్లకు కేటాయించనున్నారు. పాలసీదారుల ప్రయోజనాల దృష్ట్యా మెజారిటీ వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతుంది. నియంత్రిత వాటాను అట్టిపెట్టుకుంటుంది. LIC ఐపీవోకు మార్గం సుగమం అవుతోంది.

10 శాతం కాదు.. 5 శాతం

10 శాతం కాదు.. 5 శాతం

LIC IPOకు వీలుగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వేదికను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద కంపెనీల లిస్టింగ్ నిబంధనల్ని సవరించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ప్రకటన చేసింది. ప్రస్తుత పెద్ద కంపెనీలు ఐపీవోకు రావాలంటే 10 శాతం అవసరం లేదని, దాదాపు 5 శాతం వాటాలను విక్రయిస్తే చాలునని, ఆ తర్వాత కూడా మూడేళ్లకు బదులు అయిదేళ్లలో 25శాతం వాటాలను ప్రజలకు కేటాయించే అవకాశం ఉందని సెబీ పేర్కొంది. ఈ నిర్ణయంతో భారీ కంపెనీలు మార్కెట్ లిస్టింగ్ మరింత సరళతరమవుతుంది.

ఎల్ఐసీ ఐపీవో ఇలా...

ఎల్ఐసీ ఐపీవో ఇలా...

ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.4,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీలు కనీసం 10 శాతం విక్రయించాలి. అలాగే, 3 సంవత్సరాలలో 25 శాతంగా ఉండాలి. అయితే ఇప్పుడు సెబీ.. ఎల్ఐసీ ఐపీవోకు అనుగుణంగా కొంత సవరణ చేసింది. పోస్ట్ ఇష్యూ అనంతరం రూ.10,000 కోట్లు ప్లస్, మార్కెట్ క్యాప్‌లో 5శాతంతో ఐపీవోకు రావొచ్చునని తెలిపింది. ఒక్కసారిగా 10 శాతం వాటాలకు పబ్లిక్ ఇష్యూకు వెళ్లకుండా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొనే అవకాశం ప్రభుత్వానికి దక్కింది.

అంచనా ప్రకారం ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లుగా ఉంటుంది. వ్యాల్యుయేషన్ తర్వాత రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. కొత్త సెబి నిబంధనల ప్రకారం ఎల్ఐసీ రూ.10 లక్షల మార్కెట్ క్యాప్ పైన రూ.55,000 కోట్లతో ఇష్యూకి రావాలి. ఇది రూ.10,000 కోట్లు ప్లస్ 5 శాతం. మార్కెట్ క్యాప్ రూ.15 లక్షల కోట్లుగా ఉంటే రూ.80,000 కోట్లతో ఇష్యూకి రావాల్సి ఉంటుంది. రూ.8 లక్షల కోట్లు అయితే రూ.45,000 కోట్లు అవుతుంది.

అందుకే ఈ నిర్ణయం

అందుకే ఈ నిర్ణయం

ఎల్ఐసీ మార్కెట్లోకి రావడానికి కంపెనీ పరిమాణం కూడా అడ్డంకిగా చెబుతున్నారు. పాత నిబంధనల ప్రకారం ఇది మార్కెట్లోకి వస్తే రూ.లక్ష కోట్లకు పైనే అవసరం. అప్పుడు మార్కెట్ దీనిని ఏమాత్రం తట్టుకొనే పరిస్థితి ఉండదు. దీంతోపాటు ఇష్యూ తర్వాత మార్కెట్ మూలధన విలువ పెరిగే కొద్దీ పబ్లిక్ వాటాలపై ఉన్న నిబంధనలను సరళతరం చేసింది. ఈ నిర్ణయం ఎల్ఐసీకి ఉపయోగమే. బుధవారం జరిగిన సెబీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+