రిజిస్టర్ కాని పెట్టుబడి సలహాదారులపై సెబీ సీరియస్.. వారిని అడ్డుకునేందుకు యాక్షన్ షురూ
SEBI: పెట్టుబడిదారుల ఇన్వెస్ట్ మెంట్ను సంరక్షించడం కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సందర్భోచితంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. తాజాగా మరోసారి సంచలన మార్పువైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సెబీ వద్ద రిజిస్టర్ కాకుండా ఇన్వెస్ట్ మెంట్ సలహాలు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ పరిధిలో నమోదుకాని పెట్టుబడి సలహాదారులపై కొరడా ఝళిపించేందుకు సెబీ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేసేందుకు సెబీ సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్ మధాబి పూరి బుచ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

ముంబైలో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ప్రారంభం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మధాబి మాట్లాడారు. సెబీ వద్ద రిజిస్టర్ కాని ఇన్వెస్ట్ మెంట్ అడ్వైసర్స్ ను అడ్డుకునేందుకు ఏదైనా విధానం ఉందా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. "Something's cooking. Wait for some time" అంటూ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టనున్నట్లు హింట్ ఇచ్చారు.
రెగ్యులేటర్ వద్ద నమోదు కాకుండా సలహాలు ఇస్తున్న ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్లు మరియు ఫైనాన్షియల్ ఇన్ ఫ్లూయెన్సర్లపై సెబీ కఠినంగా వ్యవహరిస్తోంది. మోసపూరిత విధానాల ద్వారా ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్లు వివిధ స్టాక్స్ లోకి మళ్లించడం ద్వారా సలహాదారులు లబ్ధి పొందడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ఫిన్ ఫ్లూయెన్సర్ గుంజన్ వర్మపై తీసుకున్న చర్యలు ఈ కోవకు చెందినవే.


Click it and Unblock the Notifications