Reliance: రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సెబీ జరిమానా.. జియో-ఫేస్బుక్ డీల్ విషయంలో..
JIO-Facebook Deal: రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సెబీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. వార్తాపత్రిక ద్వారా వెల్లడించిన జియో-ఫేస్బుక్ డీల్కు సంబంధించిన విషయంలో స్టాక్ ఎక్స్ఛేంజ్కు సత్వర వివరణ ఇవ్వనందుకు సెబీ చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇద్దరు వ్యక్తులపై క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ సోమవారం రూ. 30 లక్షల జరిమానా విధించింది. సెబీ జరిమానా విధించిన ఇతర ఇద్దరు వ్యక్తులు -- సావిత్రి పరేఖ్, కె సేతురామన్. సెబీ ఆర్డర్ ప్రకారం.. జరిమానాను 45 రోజుల్లోగా వారు చెల్లించాల్సి ఉంది.
"JIO Facebook డీల్కు సంబంధించిన వార్తలు 2020 మార్చి 24, 25 తేదీల్లో వెలువడినట్లు గుర్తించాం. Facebook.. జియో ప్లాట్ఫారమ్లలో 9.99 శాతం వాటా కోసం రూ. 43,574 కోట్ల పెట్టుబడి పెట్టనుంది" అనే హెడ్డింగ్ తో మీడియా విడుదల గురించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందింది. ఏప్రిల్ 22, 2020న, అంటే 28 రోజుల తర్వాత తగిన పెనాల్టీని విధించాల్సి ఉంది" అని సెబీ న్యాయనిర్ణేత అధికారి బర్నాలీ ముఖర్జీ ఉత్తర్వుల్లో తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రచురించని ధర-సున్నితమైన సమాచారాన్ని కవర్ చేయాల్సిన బాధ్యత ఉందని రెగ్యులేటర్ తెలిపింది. అయితే దీనిపై కంపెనీ వివరణ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి పరేఖ్, సేతురామన్ వార్తలపై పరస్పరం స్పష్టత ఇవ్వవలసి ఉంది. ఈ విషయంలో వారు న్యాయమైన డిస్క్లోజర్ రూల్స్ పాటించలేదని గమనించినట్లు రెగ్యులేటర్ వెల్లడించింది. లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ నిబంధనల ప్రకారం.. లిస్టెడ్ ఎంటిటీ తన స్వంత చొరవతో స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించబడిన ఏదైనా ఈవెంట్ లేదా సమాచారాన్ని ధృవీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయితే.. డిస్క్లోజర్ రూల్స్ పాటించనందున, రూల్స్ ఉల్లంఘింటినందుకు గాను చర్యలు తీసుకున్నట్లు సెబీ వెల్లడించింది.