సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) బ్రైట్కామ్ గ్రూప్ లిమిటెడ్ పై కొరడా ఘుళిపించింది. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో పెద్ద మోసం జరిగిందని ఆ సంస్థ డైరెక్టర్లకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
కంపెనీ సీఎండీ సురేష్ రెడ్డితో పాటు మరి కొందరు సీనియర్ అధికార్లకు షో-కాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం, Brightcom యాడ్-టెక్, న్యూ మీడియా, డిజిటల్ ప్రకటనల వ్యాపారంలో ఉంది.

US, ఇజ్రాయెల్, లాటిన్ అమెరికా, పశ్చిమ ఐరోపా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలతో సహా వివిధ భౌగోళిక ప్రాంతాలలో అనుబంధ సంస్థలు, కార్యకలాపాలను కొనసాగిస్తోంది. బ్రైట్ కామ్ గ్రూప్ 2014-15 నుంచి 2019-20 మధ్య లాభాలను ఎక్కువ చూపి ఖర్చులను తక్కువ చేసి చూపినట్లు సెబీ గుర్తించింది.
దీనిపై దర్యాప్తునకు కూడా ఆదేశించింది. కంపెనీ విదేశీ అనుబంధ సంస్థలకు సంబంధించిన ఖాతాల పుస్తకాలు, ఇతర సమాచారంలో అనేక లోపాలను సెబీ గుర్తించింది. ఇది ప్రధానంగా FY20లో రూ. 868.30 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించినదిగా తెలుస్తోంది.
కంపెనీ బోర్డులోకి ఒక స్వతంత్ర డైరెక్టర్ను నియమించాలని సెబీ సూచన చేసింది. కంపెనీ అనుసరిస్తున్న అకౌంటింగ్ విధానాలు, సమర్థతపై ఒక నివేదికను స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందజేయాల్సిందిగా బ్రైట్కామ్ గ్రూపు ఆడిట్ కమిటీకి స్పష్టం చేసింది. అంతర్గత ఆడిటింగ్ విధానాలను సమీక్షించాలని ఆదేశించింది.
బ్రైట్కామ్ గ్రూపు సబ్సిడరీ కంపెనీల స్టాండ్ అలోన్ ఖాతాలను 15 రోజుల్లోగా కంపెనీ వెబ్సైట్లో పెట్టాలని కోరింది. "అన్ని ప్రమాణాల ప్రకారం, అకౌంటింగ్ షెనానిగన్లు మరియు సందేహాస్పద అకౌంటింగ్ పద్ధతులు, నోటీసులు ఆశ్రయించబడ్డాయి, పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి" అని సెబి పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications