ICICI Bank News: అదానీ కంపెనీలపై ఇటీవల అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బెర్గ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల లక్షల కోట్ల మేర సదరు గ్రూపునకు నష్టం వాటిల్లింది. అంతటితో ఊరుకోకుండా ఇటీవల సెబీ చీఫ్ మధబి పూరి బుచ్పై కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ మరోసారి విరుచుకుపడింది. దీంతో ఇప్పటికే సెబీ విశ్వసనీయతపై ప్రపంచవ్యాప్తంగా నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఇదే సమయంలో దేశంలోని రెండవ అత్యంత విలువైన బ్యాంక్ ICICI మరియు దాని అనుబంధ సెక్యూరిటీల సంస్థ మెర్జర్కి సంబంధించి వివాదం చెలరేగింది. బ్రోకరేజ్ సంస్థ వాటాదారులు కొంతమంది ఈ మెర్జర్ నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీ పెట్టుబడిదారులకు నష్టపరిహారం విషయంలో రెగ్యులేటర్ తన స్వంత నిబంధనలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై కలత చెందారు. ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్ను డీలిస్ట్ చేయడానికి సెబీ ఎలా అనుమతించిందంటూ ప్రశ్నిస్తున్నారు.

బ్రోకరేజ్లో బ్యాంక్ దాదాపు 75 శాతం వాటా కలిగి ఉంది. గతేడాది జూన్లో ప్రతి 100 ICICI సెక్యూరిటీలకు బ్యాంక్ 67 షేర్లను అందించడంతో మిగిలిన షేర్ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో వాటాదురులు తమకు 200 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందంటూ ముంబైలోని కంపెనీ-లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఆగస్టు 21న వారి సవాలును రద్దు చేసి డీల్ కొనసాగించేందుకు ట్రిబ్యునల్ అనుమతించింది. కాగా వారు న్యూ ఢిల్లీలోని మరొక ట్రిబ్యునల్ ముందు ప్రత్యేక క్లాస్-యాక్షన్ దావా వేశారు. ఈ వివాదంపై ముంబైలోని ఉన్నత న్యాయస్థానం కూడా విచారణ జరుపుతోంది.
లిస్టెడ్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఎక్స్ఛేంజీల నుంచి ఓ సంస్థను డీ లిస్టింగ్ చేసే వేళ.. రెగ్యులేటర్ మార్గదర్శకాల ప్రకారం సరసమైన ధరను కనుగొనడానికి బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించాలి. అయితే దీనికి ఒక మినహాయింపు ఉంది. టార్గెట్ కంపెనీ కొనుగోలుదారు అనుబంధ సంస్థగా ఉండి, ఒకే రకమైన వ్యాపారంలో ఉన్నప్పుడు రెండు కంపెనీల వాటాదారులకు స్వాప్ నిష్పత్తిని చెప్పి ఓటు వేయమని అడగాలి. కానీ ఇక్కడ ఆ రెండూ ఒకే లైన్ ఆఫ్ బిజినెస్లో లేవు కాబట్టి సెబీ నుంచి ICICI మినహాయింపు కోరడంతో ముందుకెళ్లి ఓటింగ్ నిర్వహించింది.
72 శాతం వాటాదారులు అనుకూలంగా ఓటు వేశారు. బ్రోకరేజ్ తన మైనారిటీ పెట్టుబడిదారుల వ్యక్తిగత డేటాను బ్యాంక్తో పంచుకోవడంతో ICICI ఉద్యోగులు వారిని సంప్రదించారు. లావాదేవీకి సంబంధించి వివరించి ఇ-ఓటింగ్లో పార్టిసిపేషన్ పెంచడం దాని ఉద్దేశ్యంగా ఉంది. కానీ డేటాను పంచుకోవడం నిబంధనలకు విరుద్ధం కావడంతో రెగ్యులేటర్ ICICIకు వార్నింగ్ ఇచ్చింది. అయితే ICICI సెక్యూరిటీస్ మరియు బ్యాంక్ విలీన నిబంధనలను స్వతంత్ర వాల్యుయేషన్ నిపుణులు నిర్ణయించారని, పలు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థల ద్వారా సరసమైన ధర గుర్తించబడినట్లు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications