Madhabi Puri Buch: భారత మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీలో పెద్ద వివాదం నడుస్తోంది. ఉద్యోగులు అత్యంత ఒత్తిడితో కూడిన విషపూరితమైన పని వాతావరణంలో తాము పనిచేస్తున్నామంటూ గతనెల ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ వివాదం ముదిరి పాకానపడుతోంది.
దీంతో నేడు సెబీ ముంబై హెడ్ ఆఫీసు వద్ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి చెందిన దాదాపు 200 మంది ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో సెబీ చైర్పర్సన్ మాధబి పూరీ బుచ్ రాజీనామా చేయాలంటూ వారు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రిత్వ శాఖకు లేఖ రాయటంపై 'బాహ్య శక్తులు' కారణమంటూ బుధవారం నాటి ప్రకటనను సెబీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మౌన నిరసన చేపట్టారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం సెబీలోని వివాదం మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

సుమారు రెండు గంటలపాటు నిరసన కొనసాగించి. దీనితర్వాత వారు తిరిగి తమ కార్యాలయంలో పనికి వెళ్లారు. ఈ వ్యవహారంలో సెబీ కార్యాలయాల్లో వృత్తిపరమైన పని సంస్కృతికి సంబంధించిన వాదనలు 'తప్పు'గా ఉన్నాయని బుధవారం పేర్కొంది. ఉద్యోగులపై అసత్యాలు ప్రచారం చేసినందుకు పత్రికా ప్రకటనను ఉపసంహరించుకోవడం, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయడం తమ తక్షణ డిమాండ్లని తేల్చి చెప్పారు. ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్స్(HRA)కి సంబంధించిన సమస్యలు బాహ్య మూలకాల ద్వారా తప్పుదారి పట్టించబడుతున్నాయని వారు చెబుతున్నారు.
రెగ్యులేటర్ దాని జూనియర్ అధికారులకు కొన్ని బయటి పార్టీల నుంచి సందేశాలు వస్తున్నాయని, వారు మీడియా, మంత్రిత్వ శాఖ లేదా బోర్డుకు వెళ్లమని వారిని ప్రేరేపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. IIM అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి మధబి పూరీ బుచ్ అవినీతి ఆరోపణలతో చుట్టుముట్టిన తరుణంలో సెబీ ఉద్యోగుల తాజా వివాదం చోటు చేసుకుంది. అదానీకి సంబంధించిన విషయానికి సంబంధించి అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ సెబీ చీఫ్పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సెబీ చీఫ్ను కూడా కాంగ్రెస్ చుట్టుముట్టింది.


Click it and Unblock the Notifications