Sebi new proposals: ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాల్లో రిటైల్ ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికీ వాటిలో పెట్టుబడి కోసం వేలకు వేలు కావాలేమోనని భ్రమపడేవారు కూడా ఉన్నారు. కానీ అత్యంత తక్కువ ధరకే సిప్ అందుబాటులోకి తేవాలని, తద్వారా మరింత మందిని మార్కెట్ కార్యకలాపాల్లో భాగస్వాములు చేయాలని సెబీ ఆలోచిస్తోంది.
భారతీయ పెట్టుబడిదారులకు నెలకు 250 సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఛైర్పర్సన్ మధబి పూరి బుచ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సహకారంతో ఈ ఫ్రేమ్వర్క్పై పని చేస్తున్నట్లు ఇటీవల జరిగిన CII కార్యక్రమంలో వెల్లడించారు.

'సాధ్యమైనంత మందిని మార్కెట్ కార్యకలాపాల్లోకి తీసుకురావాలనే సెబీ ఎజెండా చాలా ముఖ్యమైనది. సర్వీసింగ్ ఖర్చును తగ్గించడం ద్వారా కేవలం 250 SIPని ప్రవేశపెట్టడం అనేది ఆర్థిక ఉత్పత్తులను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే మా ప్రణాళికలో ఓ కీలక ముందడుగు' అని బుచ్ పేర్కొన్నారు. మార్కెట్ను మరింత వృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సాంకేతికతను చొప్పించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
దేశ ఆర్థిక వృద్ధిని నడిపించే జాతీయ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా వికసిత్ భారత్ ప్రయాణం వైపు మన ప్రయాణం వేగవంతం అవుతుందని సెబీ ఛైర్పర్సన్ వివరించారు. ప్రతి పౌరుడు వృద్ధి ప్రక్రియలో పాల్గొనేలా చూసుకోవడం ద్వారా సామాజిక చేరికను సులభతరం అవుతుందన్నారు. ఇందుకుగాను భాషా అవరోధాన్ని తొలగిస్తూ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే విస్తృత పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి IPO ప్రాస్పెక్టస్ 15-16 స్థానిక భాషలలో ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications