Mutual Funds: చాలా కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది నేరుగా మార్కెట్లలో ఈక్వీటీస్, డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తుండగా.. కొందరు మాత్రం పరోక్షంగా మ్యూచువల్ ఫండ్ ఎంపికలను దీనికోసం వినియోగిస్తున్నారు. అయితే ఇందులో చిన్న పెట్టుబడిదారులను సైతం పార్టిసిపేట్ చేసేందుకు వీలు కల్పించాలని రెగ్యులేటర్ సెబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఎస్ఐపీల రూపంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య క్రమంగా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో చిన్న ఇన్వెస్టర్ల చూపు సైతం ఈ పెట్టుబడి సాధనాలపై పడుతోంది. త్వరలో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు స్టార్ట్ చేద్దాం అనుకునేవారికి పెద్ద శుభవార్త ఒకటి ఉంది. అవును త్వరలో కనీస ఎస్ఐపీ పెట్టుబడి మెుత్తాన్ని రూ.250కి తగ్గించనున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్పర్సన్ మధబి పూరి బుచ్ తెలిపారు. ప్రస్తుతం ఇది చాలా ఫండ్స్ లో కనీసం రూ.500గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపాదించిన మైక్రో సిప్ కోట్లాది మంది చిన్న పెట్టుబడిదారుల ఆశలకు అండగా నిలుస్తుందని బుచ్ అభిప్రాయపడ్డారు.

మైక్రో-SIPలు అంటే ఏంటి?
మైక్రో-SIP అనేది సాంప్రదాయ క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలకు చౌకైన ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి సాంప్రదాయ ఎస్ఐపీలో కనీస పెట్టుబడి మెుత్తం రూ.500గా ఉంటుంది. అయితే చిన్న పెట్టుబడిదారులు, గ్రామీణ నివాసితులు, రోజువారీ వేతనం అందుకునే వ్యక్తులు తమ డబ్బును ఇన్వెస్ట్ చేసేందుకు తక్కువ మెుత్తంతో దీనిని పూర్తి చేసేందుకు మైక్రో సిప్ డిజైన్ చేయబడింది. ప్రస్తుతం జూలై డేటా ప్రకారం నెలవారీ మెుత్తం ఎస్ఐపీలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో రూ.23,332 కోట్లుగా ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వెల్లడించింది. ఎస్ఐపీలకు పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా తక్కువ మెుత్తంలో పెట్టుబడి అవకాశాలను పెంచాలని మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ తాజా ఆలోచనతో ముందుకు వచ్చింది.
దేశ అభివృద్ధిలో చిన్న పెట్టుబడిదారులు సైతం పాల్గొనటం ద్వారా మార్కెట్ పార్టిసిపెంట్లకు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్కు పెంచాలని లక్ష్యంగా సెబీ చర్యలు చేపట్టింది. డిజిటలైజేషన్ దేశంలోని ప్రతి మూలకు చేరిన వేళ సెబీ దేశంలోని ప్రస్తుత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకుని అతిచిన్న పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండే పెట్టుబడి అవకాశాలను అందించాలని తాజా ప్రయత్నం ద్వారా చూస్తోంది. పెట్టుబడిదారులను కనెక్ట్ చేయడం, సేవలందించే ప్రక్రియను మరింత సమర్ధవంతంగా చేయడానికి సాంకేతికతను మరింత మెరుగ్గా ఉపయోగించాలని సెబీ చీఫ్ నొక్కి చెప్పారు. అయితే ఇప్పటికే మార్కెట్లో నావీ వంటి సంస్థలు నెలకు కనీసం రూ.10 పెట్టుబడితో ఎస్ఐపీలను ప్రారంభించేందుకు చిన్న పెట్టుబడిదారులకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications