IPO Scam: 2023 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోల్లో 95 శాతం మేర ఇన్వెస్టర్లకు సానుకూల రాబడులను అందించాయి. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఐపీవోలుగా వచ్చిన కంపెనీలు నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఐపీవోల వెనుక జరుగుతున్న మోసాలు బయటపడినట్లు తెలుస్తోంది.
క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ అందుకున్న సబ్స్క్రిప్షన్ల సంఖ్యను పెంచిందనే ఆరోపణలపై మూడు ఐపీవోలను మాధబి పూరి బుచ్ పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అయితే ఈ క్రమంలో సదరు కంపెనీల పేర్లు కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల పేర్లను కానీ ఆమె బయటకు ప్రకటించలేదు. క్యాపిటల్ మార్కెట్ వాచ్డాగ్ ఇటువంటి దుష్ప్రవర్తనలను అరికట్టడానికి చర్యలపై పనిచేస్తోందని అన్నారు.

గడచిన కొన్ని నెలలుగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్న కంపెనీల లిస్ట్ పెరుగుతున్న క్రమంలో మాధబి చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. వాస్తవానికి గడచిన ఏడాదిలో సుమారు 175 ఎస్ఎమ్ఈ కంపెనీల ఐపీవోలు మార్కెట్లోకి అరంగేట్రం చేయగా.. దాదాపు 55 మెయిన్ బోర్డ్ కంపెనీల ఐపీవోలు దలాల్ స్ట్రీట్లో కోలాహలం చేశాయి. వీటిలో చాలా సంస్థలు చారిత్రాత్మక రికార్డు ధరలకు జాబితా చేయబడ్డాయి. ఈ క్రమంలో ఎస్ఎమ్ఈ సంస్థలు మార్కెట్ల నుంచి దాదాపు రూ.5,000 కోట్లను మూలధన అవసరాల కోసం విజయవంతంగా సమీకరించాయి.
అయితే 2022లో 40 IPOల ద్వారా సేకరించిన రూ.59,303 కోట్లతో పోలిస్తే, IPOల ద్వారా మెయిన్బోర్డ్ ప్లేయర్ల నిధుల సేకరణ 2023లో 17 శాతం తగ్గి 57 కంపెనీల ద్వారా రూ.49,434 కోట్లకు పడిపోయిందని ప్రైమ్ డేటాబేస్ డేటా సూచించింది. 2022లో మార్కెట్లోకి వచ్చి నిరాశకు గురిచేసిన ఐపీవోగా ఎల్ఐసీ ఇన్వెస్టర్లకు చేదు అనుభవాన్ని సైతం మిగిల్చింది. ఈ అతిపెద్ద ఐపీవో నుంది భారత ప్రభుత్వం ఏకంగా రూ.21,000 కోట్లను పెట్టుబడిదారుల నుంచి సమీకరించింది. IPOల హడావిడి మధ్య ప్రాథమిక మార్కెట్ కార్యకలాపాల్లో ముఖ్యంగా SME స్థలంల్లో అధిక వాల్యుయేషన్లు, కొన్ని దుష్ప్రవర్తనలపై బుచ్ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications