Quant Funds News: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. డైరెక్టుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి నష్టాలు మూటగట్టుకునే కంటే ఇదే బెటర్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రిస్క్ తక్కువతో పాటు లాంగ్ టర్మ్లో భారీ వృద్ధి సాధించే అవకాశం ఉండటంతో జనం ఎగబడుతున్నారు. అయితే ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని మేనేజ్ చేసే ఫండ్ హౌస్లపై ఒక్కోసారి పలు ఆరోపణలు వస్తుంటాయి.
93 వేల కోట్ల ఆస్తుల నిర్వహణతో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ దేశంలోని పెద్ద ఫండ్ హౌస్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఫ్రంట్ రన్నింగ్ అనుమానాలతో క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ సెర్చ్ మరియు సీజర్ ఆపరేషన్లను నిర్వహించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ముంబై మరియు హైదరాబాద్లోలలో ఇవి జరిగినట్లు సమాచారం. దీంతో క్వాంట్ మ్యూచువల్ ఫండ్కు చెందిన స్మాల్క్యాప్ హోల్డింగ్లు ఈరోజు ఒత్తిడిలో కొనసాగవచ్చని అంచనా.

మ్యూచువల్ ఫండ్స్లో ఫ్రంట్-రన్నింగ్ అనేది ఒక చట్టవిరుద్ధమైన పద్ధతి. ఇందులో ఫండ్ హౌస్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు పెట్టిన భారీ ఆర్డర్ సమాచారంతో బ్రోకర్ లేదా డీలర్ ఆయా స్టాక్స్ని కొనుగోలు చేస్తుంటారు. అంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ కొనుగోలు చేయనున్న స్టాక్స్ సమాచారాన్ని ముందుగా తెలుసుకున్న బ్రోకర్.. తన వ్యక్తిగత లాభం కోసం అవే స్టాక్స్లో లావాదేవీలు నిర్వహిస్తారు. తద్వారా ధర పెరిగిన తర్వాత వాటిని తిరిగి విక్రయించి లాభం పొందుతారు.
ఇదే మాదిరిగా మ్యూచువల్ ఫండ్స్ హౌసెస్ తమ స్టాక్స్ విక్రయ సమయంలోనూ ఆర్డర్ ఎగ్జిక్యూషన్కు ముందే ఆయా కంపెనీల షేర్లను బ్రోకర్ షార్ట్-సెల్ చేస్తారు. అయితే ఎటువంటి అనుమానం రాకుండా ఈ తరహా లావాదేవీలను తన సొంత ఖాతాల ద్వారా కాకుండా సహచరుల అకౌంట్స్ నుంచి బ్రోకర్ లేదా డీలర్ నిర్వహిస్తారు. అంతర్గత సమాచారాన్ని దోపిడీ చేయడంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు ఇది దెబ్బతీస్తుంది కాబట్టి సెబీ ఈ తరహా ప్రాక్టీస్పై చర్యలు తీసుకుంటుంది.
గత మూడు సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మ్యూచువల్ ఫండ్ హౌస్లలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. జనవరి 2020లో దీని AUM 258 కోట్లు ఉండగా.. జూన్ 2024 నాటికి అదికాస్తా 90 వేల కోట్లకు పెరిగింది. ఒక్క మే నెలలోనే ఈ ఫండ్లో నికర ఇన్ఫ్లో 43 శాతం స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి వచ్చింది. ప్రస్తుత ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించిన స్మాల్ మరియు మిడ్ క్యాప్ ఫండ్స్ దాదాపు 10 శాతం చొప్పున రిలయన్స్లో పెట్టుబడులు పెట్టడంతో లిక్విడేషన్ అనేది అసలు సమస్యే కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ తరహా ఉల్లంఘనలు బయటపడటం ఇదేమీ కొత్త కాదు. గతేడాది వీరేష్ జోషి మరియు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఫ్రంట్-రన్నింగ్ కేసులోనూ 20 మందిని సెక్యూరిటీల మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. సదరు కార్యకలాపాల ద్వారా వారు పొందిన 30.55 కోట్ల తప్పుడు లాభాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ తరహా ప్రాక్టీస్ల పెరుగుతుండటంతో. డీలర్లు మరియు ఫండ్ మేనేజర్ల అన్ని కమ్యూనికేషన్లను రికార్డు చేయడం తప్పనిసరి చేస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications