SEBI: Zee-Sony కంపెనీల విలీనానికి సంబంధించిన విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. జీ యాజమాన్యం ఎస్సెల్ గ్రూప్ చీఫ్ సుభాష్ చంద్ర, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో పునీత్ గోయెంకాపై సెబీ నిషేధం విధించింది.
సెబీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వీరిద్దరూ జీకి సంబంధించిన ఏదైనా లిస్టెడ్ కంపెనీలు లేదా దాని అనుబంధ సంస్థలలో డైరెక్టర్ లేదా మరే ఇతర కీలకమైన మేనేజీరియల్ పదవులు కలిగి ఉండరాదని మార్కెట్ రెగ్యులేటర్ ప్రకటించింది. వీరిద్దరూ నిధులను స్వాహా చేసేందుకు తమ అధికార హోదాను దుర్వినియోగం చేసినట్లు క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆరోపించింది.

ప్రస్తుతం జీలో ప్రమోటర్ కుటుంబానికి కేవలం 3.99 శాతం వాటా మాత్రమే ఉంది. అయినప్పటికీ జీ వ్యాపార వ్యవహారాలకు సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకాలు నాయకత్వం వహిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నప్పుడు సదురు వ్యక్తులను ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా దాని అనుబంధ సంస్థలలో డైరెక్టర్/KMPగా కొనసాగడం ఆ కంపెనీల ప్రయోజనాలకు.. ముఖ్యంగా ఇన్వెస్టర్లకు హాని కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చినట్లు సెబీ పూర్తికాల సభ్యుడు అశ్వనీ భాటియా చెప్పారు.
జీ సంస్థ ఆస్తులను, ఇతర ఎస్సెల్ గ్రూప్ లిస్టెడ్ ఎంటిటీలను.. తమ ఆధీనంలోని అసోసియేట్ సంస్థల ప్రయోజనాల కోసం తండ్రి కొడుకులు విరివిగా వినియోగించినట్లు సెబీ ఆరోపిస్తోంది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్లో కంపెనీ నుంచి నిధులను స్వాహా చేసినందుకు, ఇతర నిబంధనలను ఉల్లంఘించినందుకు SGRL, దాని మాజీ ఛైర్మన్ అమిత్ గోయెంకా, ప్రమోటర్ జయనీర్ ఇన్ఫ్రాపవర్ అండ్ మల్టీవెంచర్స్, మరో ఐదుగురికి వ్యతిరేకంగా సెబీ మధ్యంతర ఆర్డర్-కమ్-షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదే విషయాన్ని రుణదాతలు NCLTకి తీసుకువెళ్లారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications