సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నటుడు అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టి, యూట్యూబర్ మనీష్ మిశ్రా సాధన బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లు - శ్రేయా గుప్తా, గౌరవ్ గుప్తా, సౌరభ్ గుప్తా సహా 31 సంస్థలను నిషేధించింది. పూజా అగర్వాల్, వరుణ్ మీడియా -యూట్యూబ్ ఛానెల్లలో తప్పుదారి పట్టించే వీడియోలను అప్లోడ్ చేయడానికి సంబంధించిన కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

పంప్ అండ్ డంప్
రెగ్యులేటర్ "పంప్ అండ్ డంప్" స్కామ్ తర్వాత ఎంటిటీలు చేసిన రూ. 41.85 కోట్ల అక్రమ లాభాలను స్వాధీనం చేసుకుంది. మొత్తం 31 మంది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో ఎస్క్రో ఖాతాను తెరిచి, స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని 15 రోజులలోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
టెలివిజన్ ఛానల్ సాధనా బ్రాడ్కాస్ట్ స్క్రిప్లో కొన్ని సంస్థల ద్వారా ధరల తారుమారు చేసి, షేర్లను ఆఫ్లోడ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది.

యూట్యూబ్ వీడియోలు
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కంపెనీకి సంబంధించిన తప్పుడు కంటెంట్తో యూట్యూబ్ వీడియోలను తప్పుదారి పట్టించారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. పెట్టుబడిదారులు అసాధారణ లాభాల కోసం సాధన స్టాక్ను కొనుగోలు చేయాలని సిఫార్సు చేసేందుకు ఈ YouTube
ఛానెళ్లను వినియోగించుకున్నారు.

ది అడ్వైజర్
మనీష్ మిశ్రా యాజమాన్యంలోని నిర్వహిస్తున్న "ది అడ్వైజర్", "మనీవైస్" అనే రెండు యూట్యూబ్ ఛానెల్లలో సాధన గురించి తప్పుడు వీడియోలు జూలై 2022లో అప్లోడ్ చేశారు. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ని అదానీ గ్రూప్ టేకోవర్ చేయబోతోందని, అలాగే కంపెనీ త్వరలో టీవీ ప్రొడక్షన్ నుంచి సినిమా ప్రొడక్షన్కి మారుతుందని, నాలుగు భక్తి చిత్రాలను రూపొందించడానికి ఒక పెద్ద అమెరికన్ కార్పొరేషన్ 1,100 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుందని తప్పుడు ప్రచారం చేశారు.

ది అడ్వైజర్
యూట్యూబ్ లో ఈ వీడియోలు పెట్టిన తర్వాత సాధన స్క్రిప్ ధర పెరిగింది. వాటాదారుల సంఖ్య 2,167 నుండి 55,343కి పెరిగింది. ఈ ప్రచారానికి ముందు ప్రమోటర్లు, అలాగే నటుడు అర్షద్ వార్సీ ఈ స్టాక్ లో భారీ పెట్టుబడి పెట్టారు. తప్పుడు ప్రచారం తర్వాత స్టాక్ పెరగడంతో ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్లు సెబి గుర్తించింది.

కంటెంట్ డిలీట్
ఈ సమయంలో, ధరలు పెరిగినప్పుడు, కొంతమంది ప్రమోటర్ షేర్హోల్డర్లు, సాధన యొక్క కీలక నిర్వహణ సిబ్బంది మరియు నాన్-ప్రమోటర్ షేర్హోల్డర్లు తమ హోల్డింగ్లలో గణనీయమైన భాగాన్ని పెంచిన ధరలకు ఆఫ్లోడ్ చేసి భారీ లాభాలను బుక్ చేసుకున్నారు. రెండు YouTube ఛానళ్లలో ఈ తప్పుడు ప్రచారం చేశారు. అందులో "The Advisor", "Moneywise" యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. అయితే వారు సెబీకి ఫిర్యాదు అందిన తర్వాత యూట్యూబ్ నుంచి కంటెంట్ ను డిలీట్ చేసినట్లు తెలిసింది. ఇందులో ద అడ్వైసర్ యూట్యూబ్ ఛానెల్ కు 840k సబ్క్రైబర్లు, మనీవైస్ కు 767k సబ్స్క్రైబర్లు ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications