సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నటుడు అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టి, యూట్యూబర్ మనీష్ మిశ్రా సాధన బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లు - శ్రేయా గుప్తా, గౌరవ్ గుప్తా, సౌరభ్ గుప్తా సహా 31 సంస్థలను నిషేధించింది. పూజా అగర్వాల్, వరుణ్ మీడియా -యూట్యూబ్ ఛానెల్లలో తప్పుదారి పట్టించే వీడియోలను అప్లోడ్ చేయడానికి సంబంధించిన కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

పంప్ అండ్ డంప్
రెగ్యులేటర్ "పంప్ అండ్ డంప్" స్కామ్ తర్వాత ఎంటిటీలు చేసిన రూ. 41.85 కోట్ల అక్రమ లాభాలను స్వాధీనం చేసుకుంది. మొత్తం 31 మంది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో ఎస్క్రో ఖాతాను తెరిచి, స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని 15 రోజులలోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
టెలివిజన్ ఛానల్ సాధనా బ్రాడ్కాస్ట్ స్క్రిప్లో కొన్ని సంస్థల ద్వారా ధరల తారుమారు చేసి, షేర్లను ఆఫ్లోడ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది.

యూట్యూబ్ వీడియోలు
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కంపెనీకి సంబంధించిన తప్పుడు కంటెంట్తో యూట్యూబ్ వీడియోలను తప్పుదారి పట్టించారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. పెట్టుబడిదారులు అసాధారణ లాభాల కోసం సాధన స్టాక్ను కొనుగోలు చేయాలని సిఫార్సు చేసేందుకు ఈ YouTube
ఛానెళ్లను వినియోగించుకున్నారు.

ది అడ్వైజర్
మనీష్ మిశ్రా యాజమాన్యంలోని నిర్వహిస్తున్న "ది అడ్వైజర్", "మనీవైస్" అనే రెండు యూట్యూబ్ ఛానెల్లలో సాధన గురించి తప్పుడు వీడియోలు జూలై 2022లో అప్లోడ్ చేశారు. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ని అదానీ గ్రూప్ టేకోవర్ చేయబోతోందని, అలాగే కంపెనీ త్వరలో టీవీ ప్రొడక్షన్ నుంచి సినిమా ప్రొడక్షన్కి మారుతుందని, నాలుగు భక్తి చిత్రాలను రూపొందించడానికి ఒక పెద్ద అమెరికన్ కార్పొరేషన్ 1,100 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుందని తప్పుడు ప్రచారం చేశారు.

ది అడ్వైజర్
యూట్యూబ్ లో ఈ వీడియోలు పెట్టిన తర్వాత సాధన స్క్రిప్ ధర పెరిగింది. వాటాదారుల సంఖ్య 2,167 నుండి 55,343కి పెరిగింది. ఈ ప్రచారానికి ముందు ప్రమోటర్లు, అలాగే నటుడు అర్షద్ వార్సీ ఈ స్టాక్ లో భారీ పెట్టుబడి పెట్టారు. తప్పుడు ప్రచారం తర్వాత స్టాక్ పెరగడంతో ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్లు సెబి గుర్తించింది.

కంటెంట్ డిలీట్
ఈ సమయంలో, ధరలు పెరిగినప్పుడు, కొంతమంది ప్రమోటర్ షేర్హోల్డర్లు, సాధన యొక్క కీలక నిర్వహణ సిబ్బంది మరియు నాన్-ప్రమోటర్ షేర్హోల్డర్లు తమ హోల్డింగ్లలో గణనీయమైన భాగాన్ని పెంచిన ధరలకు ఆఫ్లోడ్ చేసి భారీ లాభాలను బుక్ చేసుకున్నారు. రెండు YouTube ఛానళ్లలో ఈ తప్పుడు ప్రచారం చేశారు. అందులో "The Advisor", "Moneywise" యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. అయితే వారు సెబీకి ఫిర్యాదు అందిన తర్వాత యూట్యూబ్ నుంచి కంటెంట్ ను డిలీట్ చేసినట్లు తెలిసింది. ఇందులో ద అడ్వైసర్ యూట్యూబ్ ఛానెల్ కు 840k సబ్క్రైబర్లు, మనీవైస్ కు 767k సబ్స్క్రైబర్లు ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications