Tesla India: చాలా సంవత్సరాలుగా ఎలాన్ మస్క్ తన వ్యాపారాలను ఇండియా లాంటి పెద్ద దేశానికి విస్తరించాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ఎలక్ట్రిక్ కార్లతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్ లింక్ సేవలను భారతీయ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లు దానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మస్క్ కూడా వెనకడుగువేస్తూ వచ్చారు.
కానీ అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఇప్పుడు టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించటానికి ఇప్పటికే దిల్లీ, ముంబైలో ఉద్యోగుల నియామకంతో పాటు షోరూమ్ ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేస్తోంది. మోదీ సర్కార్ గత సంవత్సరంలో ప్రకటించిన ప్రోత్సాహక కార్యక్రమం త్వరలో ఆవిష్కరించనున్న మార్గదర్శకాల ప్రకారం భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఆన్-ట్యాప్ సౌకర్య ప్రక్రియను ప్రవేశపెట్టవచ్చని వెల్లడైంది. ఇది టెస్లా వంటి కంపెనీలకు అవకాశాన్ని కల్పించనుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ సౌకర్యం టెస్లా లాంటి విదేశీ సంస్థలు ఇండియాలోని ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మునుపే భారత మార్కెట్ గురించి పూర్తిగా అధ్యనం చేయటానికి వారికి అవకాశం కల్పించనుంది. 2024లో ప్రకటించబడిన భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీ స్కీమ్ అమలు కోసం వేచి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రానున్న కొన్ని వారాల్లోనే ఇది అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసుకుని అమలులోకి రానున్నట్లు వెల్లడైంది. ఈ స్కీమ్ కింద దేశంలో ఈవీలను తయారు చేసే కంపెనీలకు సుంకాలను తగ్గించాలని నిర్ణయించబడింది. అలాగే ఈ రంగంలో ఛార్జింగ్ ఇన్ ఫ్రాతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే సంస్థలకు సైతం ప్రయోజనాలు అందించబడతాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ కింద స్కీమ్ కింద దేశంలో 500 మిలియన్ డాలర్లను స్థానిక మ్యానుఫ్యాక్చరింగ్ పై పెట్టుబడి పెట్టిన సంస్థలు 5 సంవత్సరాల పాటు 35000 డాలర్లు విలువైన పూర్తిగా నిర్మించిన ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవచ్చు. ఇక్కడ దిగుమతి సుంకం 15 శాతంగా మాత్రమే ఉంటుందని నిర్ణయించబడింది.ఇప్పటికే వార్తల్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టెస్లా 21 లక్షల రేటు స్థాయిలో టెస్లా కార్లను ఇండియాలో విక్రయానికి తీసుకురానున్నట్లు వెల్లడైంది. గతంలో ఇండియా మార్కెట్లపై ఆసక్తిగల వాహన తయారీదారులు ప్రత్యేకమైన EV సౌకర్యాల పెట్టుబడి అవసరాల గురించి ఆందోళన వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications