టాటా-మిస్త్రీ ఇష్యూ: ఆ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే
టాటా గ్రూప్ - సైరస్ మిస్త్రీ వ్యవహారంలో భారత అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం NCLAT ఆదేశాలపై స్టే ఇచ్చింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ (ROC) దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ కంపెనీస్ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిని తాజాగా సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది.
టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలని ఇచ్చిన తీర్పులో కొన్ని సవరణలు చేయాలని NCLATని ROC అభ్యర్థించింది. దీనికి NCLAT నిరాకరించంతో ROC సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ROC విజ్ఞప్తిని NCLAT తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది.
టాటా సన్స్ - సైరస్ మిస్త్రీ ఇష్యూ
సైరస్ మిస్త్రీ పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ టాటా సన్స్ వేసిన పిటిషన్తో పాటు విచారిస్తామని తెలిపింది. మిస్త్రీ పునర్నియామకాన్ని సుప్రీం కోర్టు ఈ నెల 10వ తేదీన నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మిస్త్రీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.