సైరస్ మిస్త్రీ క్రాస్ అప్పీల్, టాటా సన్స్కు సుప్రీం కోర్టు నోటీసులు
టాటా సన్స్కు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) ఆదేశాలలోని అతిక్రమణలను తొలగించాలని కోరుతూ సైరస్ మిస్త్రీ, ఆయన కంపెనీ దాఖలు చేసిన క్రాస్ అప్పీలు నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం టాటా సన్స్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేసింది.
టాటా సన్స్-మిస్త్రీ ఇష్యూ: సుప్రీం కోర్టులో సైరస్ మిస్త్రీ పిటిషన్
టాటా వర్సెస్ సైరస్
గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన సైరస్ మిస్త్రీని తిరిగి టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించాలని చెబుతూ NCLAT ఆదేశాలు జారీ చేసింది. టాటా సన్స్ పిటిషన్ నేపథ్యంలో NCLAT జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు టాటా గ్రూప్కు ఊరట కల్పించింది. దీనిపై న్యాయస్థానంలో వివాదం కొనసాగుతోంది.
వాటాకు తగిన ప్రాతినిథ్యం
ఆ తర్వాత సైరస్, ఆయన కంపెనీలు క్రాస్ అప్పీల్కు దాఖలు చేసుకున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణలో సైరస్ ఇన్వెస్ట్మెంట్ ప్రయివేటు లిమిటెడ్ దాఖలు చేసిన క్రాస్ అప్పీలుపై న్యాయమూర్తులు జస్టిస్ ఎఎస్ బొపన్న, రిషికేష్ రాయ్లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మిస్త్రీ, ఆయన కుటుంబానికి టాటా సన్స్లో ఉన్న 18.37 శాతానికి అనుగుణంగా కంపెనీలో ప్రాతినిథ్యం ఉండాలని క్రాస్ అప్పీల్లో కోరారు. సైరస్ ఇన్వెస్ట్మెంట్ ప్రయివేటు లిమిటెడ్, సైరస్ మిస్త్రీ
రూ.1.5 లక్షల కోట్లుగా..
టాటాలతో తమ గ్రూప్కో అరవై ఏళ్ల అనుబంధం ఉందని, టాటా సన్స్లో 18.37 శాతం వాటా కలిగి ఉన్నామని, దీని వ్యాల్యూ రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటుందని తన పిటిషన్లో సైరస్ మిస్త్రీ చెప్పారు. 2012లో రతన్ టాటా తర్వాత టాటా సన్స్ చైర్మన్గా మిస్త్రీ నియమించబడ్డారు. కానీ నాలుగేళ్ల తర్వాత తొలగించారు.