SBI ఊరట, సెప్టెంబర్ వరకు ఇతర బ్రాంచీల నుండి రూ.1,00,000 తీసుకోవచ్చు
బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్న బ్రాంచీ నుండి కాకుండా ఇతర బ్రాంచీల నుండి నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నట్లు ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(SBI) తెలిపింది. కరోనా నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వివిధ చర్యలు తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఇందులో భాగంగా ఇతర బ్రాంచీలకు వెళ్లి ఉపసంహరణ ఫామ్తో రూ.25,000ల వరకు సొంతంగా తీసుకునే వెసులుబాటును కల్పించింది. పాస్బుక్ ఉండాలి.
చెక్కు బుక్ ద్వారా రూ.లక్ష వరకు ఉపసంహరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఖాతాదురు కాకుండా ఇతరులు చెక్కు ద్వారా గరిష్ఠంగా రూ.50,000 వరకు తీసుకోవచ్చు. ఉపసంహరణ ఫామ్ ద్వారా నగదు తీసుకునేందుకు మూడో వ్యక్తికి అనుమతించడం లేదు. ఈ వెసులుబాటు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.
పాస్బుక్ ఉంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా రూ.25,000 ఉపసంహరించుకోవచ్చు. చెక్కు ద్వారా రూ.1,00,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. చెక్కు ద్వారా థర్డ్ పార్టీ అయితే రూ.50,000 వరకు నగదు ఉపసంహరణ అవకాశం కల్పించింది. అయితే థర్డ్ పార్టీ... చెక్కు బుక్ ద్వారా ఉపసంహరించుకుంటే వారి కేవైసీ అవసరం.