మీరు సొంత ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే శుభవార్త. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన రుణ గ్రహీతలకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుండి అమల్లోకి వచ్చేలా హోమ్ లోన్, ఆటో లోన్, ఎంఎస్ఎంఈ (MSME) రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, రుణాలు తీసుకునే వారికి ఇది తీపి కబురు అయినప్పటికీ, ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) చేసే వారికి మాత్రం ఇది కొంత నిరాశ కలిగించే విషయమే.

లోన్ రేట్లలో మార్పులు ఎలా ఉన్నాయి?
ఎస్బీఐ తన బెంచ్ మార్క్ రేట్లను తగ్గించడం వల్ల నేరుగా లోన్ ఈఎంఐల (EMI) పై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రెండు రకాల రేట్లలో కోత విధించింది..
- MCLR తగ్గింపు: అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనివల్ల ఓవర్నైట్ రేటు 7.85% కి, ఏడాది కాలపరిమితి రేటు 8.70% కి చేరింది.
- EBLR లో భారీ కోత: ఫ్లోటింగ్ రేట్ కలిగిన హోమ్, ఆటో లోన్లకు ప్రాతిపదికగా ఉండే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు (EBLR) ను ఏకంగా 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనివల్ల వడ్డీ రేటు 8.15% నుండి 7.90% కి దిగివచ్చింది.
డిపాజిట్ రేట్లపై ప్రభావం
రుణాలపై వడ్డీలు తగ్గించిన ఎస్బీఐ.. అదే సమయంలో డిపాజిట్ రేట్లను కూడా సవరించింది..
- సాధారణ FD లు: 2 నుంచి 3 ఏళ్ల లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.45% నుండి 6.40% కి తగ్గించింది.
- సీనియర్ సిటిజన్లు: వీరికి లభించే అదనపు ప్రయోజనం కొనసాగుతుంది, కానీ రేటు మాత్రం 6.95% నుండి 6.90% కి తగ్గింది.
- అమృత్ వృష్టి (444 రోజులు): ఎస్బీఐ ప్రవేశపెట్టిన ఈ పాపులర్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేటును కూడా 6.60% నుండి 6.45% కి తగ్గించింది.
ప్రభుత్వ మద్దతు అవసరం లేకుండా..
ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎలాంటి నిధుల మళ్ళింపు చేయలేదని స్పష్టం చేసింది. బ్యాంకులు తమ ఆర్థిక పనితీరును మెరుగుపరుచుకుని, సొంతంగా లాభాలను ఆర్జిస్తూ మూలధనాన్ని బలోపేతం చేసుకున్నాయని ప్రభుత్వం కొనియాడింది.
ద్రవ్యోల్బణంపై GST ప్రభావం
వస్తు సేవల పన్ను (GST) తగ్గింపు వల్ల ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్-నవంబర్ 2025 కాలంలో వినియోగదారుల ధరల సూచీ (CPI) సుమారు 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 35 బేసిస్ పాయింట్ల మేర ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఏదేమైనా SBI తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది హోమ్ లోన్ ఖాతాదారుల నెలవారీ ఈఎంఐ(EMI) భారం తగ్గనుంది. ఈ ప్రయోజనం నేరుగా కస్టమర్లకు అందాలంటే మీ లోన్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ (EBLR) తో అనుసంధానమై ఉండాలి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications