రేపటి నుండే... లోన్ తీసుకునే వారికి SBI గుడ్ న్యూస్
ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు తగ్గిస్తుందని అందరూ భావించారు. కానీ యథాతథంగా ఉంచింది. దీంతో ఏ బ్యాంకు వడ్డీ రేట్లలోను దాదాపు మార్పు లేదు. తాజాగా, SBI మాత్రం కస్టమర్లకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును తగ్గించింది.
ఏపీలో ఇక బియ్యం కార్డు, లిస్ట్లో మీ పేరు లేకుంటే ఆగాల్సిందే
10 బేసిస్ పాయింట్లు తగ్గిన SBI
SBI ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గుదల డిసెంబర్ 10 (మంగళవారం) నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ ఏడాదిలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు తగ్గించడం వరుసగా ఇది ఎనిమిదోసారి. దీంతో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఏడాదికి 8 శాతం నుంచి ఏడాదికి 7.90 శాతానికి తగ్గింది. ఇది డిసెంబర్ 10 నుంచి అమలవుతుంది.
మిగతా ఎంసీఎల్ఆర్లో మార్పు లేదు
మిగతా ఎంసీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఓవర్ నైట్, నెల రోజుల కాల పరిమితిపై ఎంసీఎల్ఆర్ 7.95 శాతంగానే ఉంది. అలాగే మూడు నెలల కాలపరిమితిపై 7.70 శాతం, ఆరు నెలల కాలపరిమితిపై 7.85 శాతం, రెండేళ్ల కాలపరిమితిపై 8.10 శాతం, మూడేళ్ల కాల పరిమితిపై 8.20 శాతం ఉంది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించకపోయినప్పటికీ ఎస్బీఐ MCLRను తగ్గించడం గమనార్హం.
అందుకే తగ్గించాం
తమ కస్టమర్లకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏడాది MCLR రేటును తగ్గించినట్లు SBI తెలిపింది. 10 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో MCRL రేటు ఇప్పుడు ఎనిమిది శాతం నుంచి 7.9 శాతానికి దిగి వచ్చిందని పేర్కొంది. MCLR తగ్గింపుతో రుణగ్రహీతలకు ప్రయోజనం కలగనుంది. హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటు దిగి వస్తుంది. దీంతో కొత్తగా రుణం తీసుకోవాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. లోన్ తీసుకున్న వారికి కూడా ప్రయోజనం ఉండొచ్చు. వీరి ఈఎంఐ భారం తగ్గొచ్చు.