భారత బ్యాంకింగ్ రంగంలో కీలక మలుపు..ఇకపై మిగిలేది నాలుగు ప్రధాన బ్యాంకులే..

భారతదేశ బ్యాంకింగ్ రంగం మరో చారిత్రాత్మక మలుపులు తీసుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల రెండో దశకు (బ్యాంక్ విలీనం 2.0) సిద్ధమవుతోంది. ఈ కొత్త ప్రణాళికతో భారతదేశంలో కేవలం నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశముందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI),పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), కెనరా బ్యాంక్ ప్రధాన స్తంభాలుగా నిలవనున్నాయి.

ఈ విలీనం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో బలహీనమైన బ్యాంకులను సమీకరించడం, క్రెడిట్ వృద్ధిని వేగవంతం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడం, మూలధన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏకీకరణ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత స్థిరత్వం మరియు దృఢత్వం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

India s banking sector is about to take another historic turn The central government is preparing for the second phase of mergers of public sector banks Bank Merger 2 0 With this new plan financial sources predict that only four large public sector banks will remain in India

ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB),సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) వంటి మధ్య తరహా బ్యాంకులను పెద్ద సంస్థలైన SBI, PNB, BoBలలో విలీనం చేసే అవకాశం ఉంది. ఈ చర్య ద్వారా ఆస్తుల నాణ్యతను మెరుగుపరచడం, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేయడం, శాఖల నెట్‌వర్క్‌ను సక్రమంగా పునర్‌వ్యవస్థీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ విలీనాలు పూర్తయితే, ప్రతి ప్రధాన బ్యాంకు పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కార్పొరేట్ రుణాలు, MSME రంగానికి మద్దతు ఇవ్వడానికి మరింత ఆర్థిక బలం సాధిస్తుంది.

అయితే ఇది మొదటిసారి కాదు. 2019లో కేంద్రం చేపట్టిన విలీన ప్రణాళికలతో 27 ప్రభుత్వ బ్యాంకులు కేవలం 12కి తగ్గించబడ్డాయి. ఆ సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో యునైటెడ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ విలీనం కాగా, కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంకులు విలీనం అయ్యాయి. ఈ విలీనాలు బ్యాలెన్స్ షీట్లు బలపరచడంలో, డిజిటల్ వ్యవస్థలను ప్రామాణీకరించడంలో ముఖ్య పాత్ర పోషించాయి.

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం పెద్ద, స్థిరమైన బ్యాంకులు అవసరమని భావిస్తోంది. పెద్ద బ్యాంకులు లైవులోకి వస్తే.. వనరులను సమర్థ వినియోగం చేయగలవు. అలాగే నిరర్థక ఆస్తుల (NPA) ఒత్తిడిని తట్టుకోగలవు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలవు. ఆధునిక డిజిటల్ సాంకేతికతను వేగంగా స్వీకరించగలవని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణాల వల్లే ప్రభుత్వం కొన్ని కానీ బలమైన బ్యాంకులు అనే విధానాన్ని అనుసరిస్తోంది.

ఇంత పెద్ద స్థాయి ఏకీకరణకు సవాళ్లు కూడా ఉన్నాయి. వివిధ బ్యాంకుల పని సంస్కృతి, సాంకేతిక వ్యవస్థలు, సిబ్బంది అనుసరణ వంటి అంశాలు సజావుగా కలవడం పెద్ద సవాలు. ఉద్యోగ భద్రత, శాఖల తగ్గింపు అంశాలపై యూనియన్లు ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా బలహీన బ్యాంకులను బలమైన వాటిలో విలీనం చేసే ప్రక్రియలో నియంత్రణ, మూలధనం, మేనేజ్‌మెంట్ సమన్వయం కీలకం కానున్నాయి.

ఈ విలీనాలు విజయవంతంగా జరిగితే.. భారతదేశ బ్యాంకింగ్ రంగం మరింత బలమైన ఆర్థిక వెన్నెముకగా మారుతుంది. పెద్ద బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకు రుణాలను విస్తరించడంలో, మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో, $5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.బ్యాంక్ విలీనం 2.0 ప్రణాళిక భారత బ్యాంకింగ్ రంగానికి నూతన శకం తెరుస్తుంది. ఇది ఆర్థిక బలం, సాంకేతిక సామర్థ్యం, ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యంతో కూడినది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+