రేపే SBI మెగా ఈ-వేలం, తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు
తాకట్టులో ఉన్న పలు ఆస్తులను ఎస్బీఐ మార్చి 5వ తేదీన ఈ-వేలం వేస్తోంది. నాణ్యమైన ఆస్తులను మార్కెట్ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇదో మంచి అవకాశంగా ఎస్బీఐ చెబుతోంది. ఈ-వేలంలో అన్ని రకాల ప్రాపర్టీలను వీటిల్లో విక్రయించనున్నట్లు తెలిపింది.
రెసిడెన్సీలు, ఇళ్లు, పరిశ్రమలు, వాణిజ్య ఆస్తులు, పరిశ్రమలు, యంత్రాలు, వాహనాలు వంటివి ఉన్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఈ బిడ్లో ఎవరైనా పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటనలను మీడియాలో, సోషల్ మీడియాలో ఉంచింది. వేలంలో ఉంచిన ఆస్తుల వివరాలను అందులో పేర్కొంది. తాకట్టులోని ఆస్తులకు సంబంధించి ఆయా బ్రాంచీల్లో సంబంధిత అధికారుల వివరాలు కూడా ఇచ్చింది.
ఈ బిడ్లో పాల్గొనే వారు సదరు ఆస్తికి సంబంధించి ఎర్నెస్ట్ డిపాజిట్ ఆఫ్ మనీ ఉంచాలి. కేవైసీ పత్రాలను సదరు బ్రాంచీలో సమర్పించాలి. బిడ్లో పాల్గొనేవారు ఈ-వేలందారుల వద్ద లేదా మరెవరైనా గుర్తింపు పొందిన ఏజెన్సీ నుండి కానీ డిజిటల్ సిగ్నేచర్ తెచ్చుకోవాలి. ఈఎండీ, కేవైసీ పత్రాలను సమర్పించిన తర్వాత బిడ్లో పాల్గొనే వారికి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ పంపిస్తారు.