Mutual Funds: ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారు చిన్న వయస్సులో ఉన్నప్పటి నుంచే పెట్టుబడులను పెడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది మంచి రాబడులను అందించే మ్యూచువల్ ఫండ్స్ కోసం వెతుకున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే వారికి SBI మ్యూచువల్ ఫండ్ మంచి ఆప్షన్ గా మారింది. SBI మ్యూచువల్ ఫండ్ ఈ ప్లాన్ను 29 సెప్టెంబర్ 2020న ప్రారంభించింది. ఈ స్కీమ్ పేరు SBI మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్. మూడేళ్ల కిందట ప్రారంభమైన ఈ స్కీమ్ మంచి రాబడులను అందించింది.

ఇన్వెస్టర్ల డబ్బు రెండింతలైంది. అప్పట్లో రూ.10గా ఉన్న స్కీమ్ ఎన్ఏవీ ప్రస్తుతం రూ.24.48గా ఉంది. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద మెుత్తం రూ.851 కోట్ల నిధులు పెట్టుబడులుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరైనా ఇన్వెస్టర్ సెప్టెంబర్ 29, 2020న రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు దాని విలువ రూ.2.44 లక్షలుగా మారింది. ఈ క్రమంలో ఫండ్ దాదాపు 145 శాతం రాబడిని అందించింది. ఇదే కేటగిరీలోని ఇతర ఫండ్స్ కంటే కంపెనీ గడచిన ఏడాది కాలంలో మెరుగైన పనితీరును కనబరిచింది.
రెండేళ్ల కాలంలో ఈ కేటగిరీలో ఇతర ఫండ్స్ 10.30 శాతం రాబడిని అందించగా.. SBI మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ మాత్రం 26.97 శాతం రాబడిని ఇచ్చింది. రూ.10 వేల చొప్పున ఎస్ఐపీ రూపంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ 23 శాతం రాబడితో మెుత్తాన్ని రూ.4.26 లక్షలు చేసింది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్లలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రాబడులను పొందవచ్చని బీపీఎన్ ఫిన్క్యాప్ డైరెక్టర్ ఎకె నిగమ్ తెలిపారు. పిల్లల కోసం దీర్ఘకాలిక పెట్టుబడి వారి భవిష్యత్తును చక్కదిద్దడానికి చాలా మంచిదని ఆయన పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications