మధ్యాహ్నం వరకు SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ సేవల్లో అంతరాయం
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(SBI) నుండి కస్టమర్లకు అలర్ట్. ఈ రోజు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యూపీఐ సేవలు కొద్ది గంటల పాటు కస్టమర్లకు అందుబాటులో లేవు. తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు సులభతర, స్మార్ట్ సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా మెయింటెనెన్స్ సేవల్లో భాగంగా గురువారం (17 జూన్) డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కొద్ది గంటలు అందుబాటులో ఉండటం లేదు.
16వ తేదీ అర్ధరాత్రి నుండి 7వ తేదీ వరకు ఎస్బీఐ సేవలు అందాబుటులో లేవు. యోనో యాప్, యోనో లైట్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటిల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్లో సమస్యలు తలెత్తుతాయని ఎస్బీఐ ముందే ప్రకటించింది.
నేడు మధ్యాహ్నం గం.2.30 వరకు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో ఫ్రాడ్స్టర్ల గురించి అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను హెచ్చరించింది. ఖాతాదారులు తమ వ్యక్తిగత ఖాతా వివరాలు వెల్లడించవద్దని తెలిపింది. ఏదైనా అన్-ఐడెంటిటీ సోర్స్ నుండి ఎలాంటి మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవద్దని హితవు పలికింది.