SBI customers alert: అర్ధరాత్రి గం.2 పాటు సేవలు బంద్
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు అలర్ట్. ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఈ రోజు (జూలై 16 శుక్రవారం) అర్ధరాత్రి సమయంలో రెండు గంటలకు పైగా నిలిచిపోనున్నాయి. కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆన్లైన్ సేవలకు సంబంధించి సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
ఇందుకుగాను రెండున్నర గంటలు సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎలాంటి సందేశాలు, అలర్ట్స్ పైన క్లిక్ చేయవద్దని చెబుతున్నారు. ఈ సమయంలో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
జూన్ 16వ తేదీ రాత్రి గం.10.45 నుండి జూలై 17 వేకువజామున గం.1.15 వరకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యూపీఐ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఇదివరకు కూడా బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. జూలై 10-జూలై 11న, అంతకుముందు జూలై 3-జూలై 4న వేకువజామున సేవలు నిలిచిపోయాయి.