రియాధ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధానికి సంబంధించిన దుష్ప్రభావం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఆరంభమైన దాడులు-ప్రతిదాడుల పర్వం 10వ రోజుకు చేరుకుంది. ఇప్పట్లో ఆగేలానూ లేదు. ఆంక్షల పరంపర కొనసాగుతున్నప్పటికీ..రష్యా ఏ మాత్రం ఖాతరు చేయట్లేదు. తన దాడి తీవ్రతను పెంచింది. ఈ వారం రోజుల వ్యవధిలో 500 మిస్సైళ్లను రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్లోని పలు నగరాలపై సంధించినట్లు కీవ్ ఇండిపెండెంట్ వెల్లడించింది.

లొంగని ఉక్రెయిన్..
అటు ఉక్రెయిన్ సైతం అంత సులభంగా లొంగట్లేదు. అమెరికా వంటి అగ్రరాజ్యం తనకు అండగా నిలవడం, యూరోపియన్ యూనియన్ దేశాల సహకారంతో రష్యాను ప్రతిఘటిస్తోంది. కీవ్ను కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది ఉక్రెయిన్ సైన్యం. ఛెర్నిహివ్, పోర్ట్ సిటీ ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్పై రష్యా వైమానిక బలగాలను అడ్డుకుంటోన్నాయి. మానవతా దృక్పథంతో రష్యా.. తాత్కాలికంగా కాల్పుల విరమణను ప్రకటించింది.

తాత్కాలిక కాల్పుల విరమణ..
మరియోపొల్-4,40,000, వొల్నొవాఖాలో 21,000 మంది ప్రజలకు ఆహారం, మంచినీరు, మెడిసిన్ అందించడానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాల్పుల విరమణ అమలులో ఉంటుంది. యుద్ధం ఇప్పట్లో పూర్తిగా ఆగేలా కనిపించకపోవడం అటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఐక్యరాజ్య సమితి సైతం జోక్యం చేసుకున్నా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. భద్రత మండలి నుంచి తొలగిస్తామంటూ హెచ్చరించినా పట్టించుకోట్లేదు.

క్రూడ్ రేట్లు ఆకాశానికి..
యుద్ధ ప్రభావం- ఊహించినట్టుగానే క్రూడాయిల్ ధరల అమాంతం పెరగడానికి కారణమైంది. బ్యారెల్ ఒక్కింటికి 120 డాలర్లను టచ్ చేసింది. దశాబ్దకాలం తరువాత ఈ స్థాయిలో ముడిచమురు రేటు పెరగడం ఇదే తొలిసారి. బ్రెంట్లో 2012లో బ్యారెల్ క్రూడాయిల్ ఒక్కింటికి 119 డాలర్లను తాకింది. ఆ తరువాత మళ్లీ ఈ స్థాయిలో వాటి రేటు పలకింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమైనప్పటి నుంచీ క్రూడాయిల్ బ్యారెల్ రేటు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడది గరిష్ఠానికి చేరింది.

సౌదీ అరేబియా కీలక నిర్ణయం..
దీని ప్రభావంతో సౌదీ అరేబియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆసియా దేశాలకు సరఫరా చేసే ముడిచమురు ధరను భారీగా పెంచింది. ఫలితంగా- ఆసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రావడం దాదాపుగా ఖాయమైంది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, రవాణా, షిప్పింగ్ సమస్యలు తలెత్తడం వల్ల వాటి రేట్లను పెంచాల్సి వచ్చిందని ఆరామ్కో తెలిపింది. అఫీషియల్ సెల్లింగ్ ప్రైస్ (ఓఎస్పీ) పెంచినట్లు పేర్కొంది.

బ్యారెల్పై..
బ్యారెల్ ఒక్కింటికి అరబ్ లైట్ క్రూడ్ ధర 4.95 డాలర్లకు పెంచింది. అమెరికా, వాయవ్య యూరోప్, మిడ్ టెర్రయిన్ రీజియన్లకు సౌదీ అరేబియా ముడిచమురును సరఫరా చేస్తోంది. ఇందులో సూపర్ లైట్, ఎక్స్ట్రా లైట్, లైట్, మీడియం, హెవీ రకాలుగా క్రూడ్ను విభజించింది. వాటన్నింటి రేట్లను కూడా సవరించినట్లు ఆరమ్కో తెలిపింది. ఒక్కో రకానికి.. ఒక్కో రేటును నిర్దేశించిందా సౌదీ అరేబియా స్టేట్ ఓన్డ్ ఆయిల్ కంపెనీ.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications