భారతదేశంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఆదేశాలపై వెనక్కి తగ్గింది. కొత్తగా అమ్మే ప్రతి మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app) ను తప్పనిసరిగా ముందుగానే (Pre-install) ఇన్స్టాల్ చేయాలనే ఆదేశాన్ని ఉపసంహరించుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

గత రెండు రోజులుగా సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app)పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఈ యాప్ ప్రతిఫోన్ లో ముందుగానే ఇన్ స్టాల్ చేయాలని రూల్ పెట్టడంతో వ్యక్తిగత గోప్యత (Privacy), ప్రభుత్వ నిఘాకు సంబంధించిన ఆందోళనలు తీవ్రం అయ్యాయి. మొబైల్ తయారీదారులు, యూజర్ల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
జరిగింది ఇదే..
మొబైల్ తయారీ కంపెనీలతో పాటు, టెక్ నిపుణులు, విపక్షాలు ఈ నిర్ణయంపై వ్యతిరేకంగా ఉన్నాయి. మొబైల్ ఫోన్లలో ఒక యాప్ను తప్పనిసరి చేయడం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని, ప్రభుత్వం తమపై నిఘా పెడుతుందని (Snooping) నిపుణులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి. దేశ పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగించడానికే, కేంద్రం ఈ సైబర్ సెక్యూరిటీ యాప్ను తప్పనిసరి చేస్తోందని వారు ఆరోపించారు. ఈ విమర్శల కారణంగా, ఈ సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app) వివాదాస్పదంగా మారింది. అయితే ఈ విమర్శలు, ఆందోళనలు తీవ్రం కావడంతో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మొబైల్ తయారీ కంపెనీలు తమ ఫోన్లలో ఈ యాప్ను ముందే ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి ఇచ్చిన స్పష్టత
విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలోనే ఈ యాప్ గురించి వివరణ ఇచ్చారు. సంచార్ సాథీ యాప్ ను యాక్టివేట్ చేసుకోవడం అనేది కేవలం ఆప్షనల్ (Optional) మాత్రమేనని, ఇది ఏ మాత్రం తప్పనిసరి కాదని ఆయన గతంలోనే ప్రకటించారు. ఈ యాప్ను ఎవరైనా తమ ఫోన్ నుంచి సులభంగా తొలగించుకోవచ్చని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా ఎటువంటి నిఘా పెట్టడం కాని, కాల్స్ మానిటర్ చేయడం కాని జరగదని, ఇది కేవలం సైబర్ సెక్యూరిటీ (Cyber Security) ప్రయోజనాల కోసం, ప్రజల రక్షణ కోసమే తయారు చేయబడిందని ఆయన వెల్లడించారు.
గతంలో ఇలా..
కొత్తగా వచ్చే ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేసి ఇవ్వాలని కేంద్రం నవంబర్ 28న ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే చర్య అని విపక్షాలు ఆందోళన చేయడంతో.. ఇది ఆప్షనల్ అని, యూజర్లు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.ఈ యాప్ ద్వారా ఇప్పటివరకూ 2.75 కోట్ల మోసపూరిత మొబైల్ కనెక్షన్లను తొలగించామని, చోరీకి గురైన 20 లక్షల ఫోన్ల లొకేషన్ను గుర్తించి అందులో 7.5 లక్షల ఫోన్లను తిరిగి అందజేశామని తెలిపారు. అయితే ప్రజల భయాందోళనల దృష్ట్యా, కేంద్రం చివరికి తప్పనిసరి అనే నిబంధన నుంచి వెనక్కి తగ్గింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications